నాదల్ కు మోంటెకార్లో మాస్టర్స్ టైటిల్ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్ను దక్కించుకున్నాడు. ఏప్రిల్ 22న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-3, 6-2తో నిషికోరి (జపాన్)ను ఓడించాడు. తద్వారా ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే టోర్నమెంట్ను అత్యధికంగా 11 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్గా నాదల్ గుర్తింపు పొందాడు. బార్సిలోనా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లను 10 సార్లు చొప్పున గెలిచిన నాదల్కు మాస్టర్స్ సిరీస్లో ఇది 31వ టైటిల్ కాగా ఓవరాల్ కెరీర్లో 76వ సింగిల్స్ టైటిల్.
కామన్వెల్త్గేమ్స్లో సైనాకు స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో సైనా నెహ్వాల్ స్వర్ణ పతకం గెలుచుకుంది. సైనా 21-18, 23-21 తేడాతో పీవీ సింధుపై విజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో సైనాకిది రెండో స్వర్ణం. ఇంతకుముందు 2010లో ఢిల్లీలో జరిగిన క్రీడల్లోనూ స్వర్ణం గెలుచుకుంది.
అలాగే బ్యాట్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ రజతం గెల్చుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట 13-21, 16- 21తో మార్కస్ ఎలిస్-క్రిస్ లాన్గ్రిడ్జ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడి రజతం గెలిచారు.
ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2018
ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో ఏప్రిల్ 4న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ 15న ముగిశాయి. 12 రోజుల పాటు జరిగిన ఈ గేమ్స్లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు మొత్తం 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ గేమ్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పి.వి.సింధు పతాకధారిగా వ్యవహరించగా ముగింపు వేడుకల్లో మేరీకోమ్ నేతృత్వం వహించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్హామ్ (ఇంగ్లండ్) లో జరగనున్నాయి.
కామన్వెల్త్ గేమ్స్ 2018 పతకాల పట్టిక
చైనా గ్రాండ్ప్రి విజేత రికియార్డో
ఫార్ములావన్ చైనా గ్రాండ్ప్రిలో ఆస్ట్రేలియాకు చెందిన రెడ్బుల్ డ్రైవర్ రికియార్డో విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 15న జరిగిన ప్రధాన రేసులో రికియార్డో 56 ల్యాప్ల రేసును గంటా 35 నిమిషాల 36.380 సెకన్లలో పూర్తి చేశాడు. తన కెరీర్లో అతనికిది ఆరో విజయం. మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్, రెకోనెన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ సీజన్లో ఇప్పటికే రెండు రేసుల్ని గెలిచిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్ప్రి ఏప్రిల్ 29న జరుగుతుంది.
క్రికెట్ ప్రసారహక్కులు దక్కించుకున్న స్టార్ ఇండియా భారత్లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల ప్రసారహక్కులను అత్యధిక మొత్తానికి స్టార్ ఇండియా దక్కించుకుంది. వేలంలో స్టార్ రూ. 6 వేల 138 కోట్ల 10 లక్షలకు హక్కులు గెలుచుకుంది. దీంతో వచ్చే ఐదేళ్ల (2018-2023) లో భారత్లో జరిగే మ్యాచ్ల ప్రపంచవ్యాప్త టీవీ ప్రసారాలు, డిజిటల్ ప్రసారాల గ్లోబల్ కన్సాలిడేటెడ్ బిడ్ (జీసీఆర్) స్టార్ సొంతమైంది. ఐదేళ్ల క్రితం ప్రసార హక్కుల కోసం స్టార్ రూ.3,851 కోట్లు చెల్లించింది.
కామన్వెల్త్ గేమ్స్లో మీరాబాయికి స్వర్ణం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ మీరాబాయి చాను విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకుంది. చాను మొత్తం (స్నాచ్లో 86+క్లీన్ అండ్ జెర్క్లో 110) 196 కేజీలు బరువెత్తి అగ్రస్థానాన్ని సంపాదించింది. మేరీ హనిత్రా రనైవొసోవా (మారిషస్-170 కేజీలు) రజతం, దినుషా గోమ్స్ (శ్రీలంక-155 కేజీలు) కాంస్యం పొందారు.
పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా 249 కేజీలు (స్నాచ్లో 111+క్లీన్ అండ్ జెర్క్ లో 138) బరువెత్తి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మొహమ్మద్ ఇజర్ అహ్మద్ (మలేసియా - 261 కేజీలు) స్వర్ణం... చతురంగ లక్మల్ (శ్రీలంక-248 కేజీలు) కాంస్యం గెలిచారు.
బెర్ముడా కు తొలి స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్లో బెర్ముడా కు చెందిన మహిళా ట్రయాథ్లెట్ ఫ్లోరా డఫీ తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్) రేసును ఆమె 56 నిమిషాల 50 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.
ఐపీఎల్ సీజన్-11 ప్రారంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదకొండో సీజన్ ఏప్రిల్ 7న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సీజన్లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఐపీఎల్ ఫైనల్ను మే 27న వాంఖడే స్టేడియంలోనే నిర్వహిస్తారు. నిషేధం కారణంగా రెండు సీజన్ల పాటు లీగ్కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తిరిగి పునరాగమనం చేశాయి.
వెయిట్ లిఫ్టింగ్లో సంజిత చానుకు స్వర్ణం
కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు చెందిన వెయిట్ లిఫ్టర్ సంజిత చాను స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 53 కేజీల విభాగంలో మొత్తం (స్నాచ్లో 84 + క్లీన్ అండ్ జెర్క్లో 108) 192 కేజీల బరువునెత్తి విజేతగా నిలిచింది. లొవా దికా టొవా (182 కేజీలు-పపువా న్యూగినియా) రజతం, రచెల్ (181 కేజీలు - కెనడా) కాంస్యం గెలిచారు.
పురుషుల 69 కేజీల విభాగంలో 18 ఏళ్ల దీపక్ లాథర్ కాంస్యం నెగ్గి, కామన్వెల్త్ గేమ్స్లో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి భారత లిఫ్టర్గా రికార్డులకెక్కాడు.
కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు ఐదు స్వర్ణాలు
కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్ లిఫ్టర్లు మూడు స్వర్ణాలు గెలుచుకున్నారు. ఏప్రిల్ 7న జరిగిన పురుషుల 85 కేజీల ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కు చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్లో 151 + క్లీన్ అండ్ జెర్క్లో 187) బరువెత్తి స్వర్ణం దక్కించుకున్నాడు. మరో ఈవెంట్ పురుషుల 77 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ 317 కేజీలు (స్నాచ్లో 144 + క్లీన్ అండ్ జెర్క్లో 173) బరువెత్తి అగ్రస్థానం దక్కించుకున్నాడు.
మహిళల 69 కేజీల విభాగంలో 22 ఏళ్ల పూనమ్ యాదవ్(ఉత్తరప్రదేశ్) మొత్తం 222 కేజీలు (స్నాచ్లో 100+క్లీన్ అండ్ జెర్క్లో 122) బరువెత్తి బంగారు పతకాన్ని గెల్చుకోగా, పురుషుల 94 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ (పంజాబ్) కాంస్య పతకాన్ని సాధించాడు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 16 ఏళ్ల మను భాకర్ ( హరియాణ) స్వర్ణం గెలుచుకుంది. పిన్న వయసులో స్వర్ణం నెగ్గిన భారత షూటర్గా ఆమె గుర్తింపు పొందింది. హీనా సిద్ధూ 234 పాయింట్లు సాధించి రజతం, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రవి కుమార్ కాంస్యాన్ని గెలుచుకున్నారు.
భారత మహిళల టీటీ జట్టు ఫైనల్లో 3-1తో సింగపూర్ను ఓడించి కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి బంగారు పతకాన్ని గెలుచుకుంది.
బహ్రెయిన్ గ్రాండ్ప్రి విజేత వెటెల్
ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బహ్రెయిన్ గ్రాండ్ప్రి టైటిల్ను గెలుచుకున్నాడు. ఏప్రిల్ 8న జరిగిన 57 ల్యాప్ల ఈ రేసును వెటెల్ గంటా 32 నిమిషాల 1.940 సెకన్లలో పూర్తి చేశాడు. బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానం, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. వెటెల్కు ఈ సీజన్లో ఇది రెండో టైటిల్. ఇది వరకే ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రిలోనూ వెటెల్ టైటిల్ గెల్చుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ కు మరో మూడు స్వర్ణాలు
కామన్వెల్త్ గేమ్స్లో ఏప్రిల్ 9న జరిగి పలు ఈవెంట్లలో భారత ఆటగాళ్లు మూడు స్వర్ణాలు గెలుచుకున్నారు. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 3-1తో మలేసియాను ఓడించి విజేత గా నిలిచింది.
టేబుల్ టెన్నిస్లో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. నైజీరియాతో జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో విజయం సాధించింది. 2002లో కామన్వెల్త్ గేమ్స్లో టీటీ ప్రవేశ పెట్టాక రెండు టీమ్ ఈవెంట్స్లో భారత్కు బంగారు పతకాలు రావడం ఇదే తొలిసారి.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 235.1 పాయింట్లు స్కోరు చేసి జీతూరాయ్ స్వర్ణం గెలిచాడు. మరో షూటర్ ఓం మితర్వల్ 214.3 పాయింట్ల స్కోరుతో కాంస్యం దక్కించుకున్నాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెహులీ ఘోష్ (247.2 పాయింట్లు) రజతం, అపూర్వీ చండిలా (225.3 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు.
25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో హీనాకు స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్లో ఏప్రిల్ 10న జరిగిన 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధూ స్వర్ణం గెలిచింది. ఫైనల్లో హీనా 38 పాయింట్లు స్కోరు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా గలియబోవిచ్ 35 పాయింట్లు సాధించి రజతం గెల్చుకోగా అలా సజానా అజహరి (మలేసియా-26 పాయింట్లు) కాంస్యం దక్కించుకుంది. హీనా ఇదివరకే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం నెగ్గింది.
బాల్ టాంపరింగ్ వివాదంలో స్మిత్, వార్నర్లపై ఏడాది నిషేధంక్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనలను అతిక్రమించినందుకు ముగ్గురు ఆటగాళ్లపై తగిన చర్యలు తీసుకున్నట్లు సీఏ మార్చి 28న ప్రకటించింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ల పై ఏడాది, బాన్క్రాఫ్ట్ పై 9 నెలలు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతోపాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వీరు ముగ్గురు బాల్ టాంపరింగ్కు పాల్పడినట్లు వీడియోలో రికార్డయింది.
స్టీవ్ స్మిత్, వార్నర్పై సీఏ ఏడాది నిషేధం విధించిన నేపథ్యంలో బీసీసీఐ వారిని ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పించింది.
సంతోష్ ట్రోఫీ విజేత కేరళ
జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీలో కేరళ జట్టు విజేతగా నిలిచింది. ఏప్రిల్ 1న కోల్కతాలో జరిగిన ఫైనల్లో కేరళ 4-2తో బెంగాల్పై విజయం సాధించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజేతగా నిలిచిన కేరళకు ఈ ట్రోఫీలో ఇది ఆరో టైటిల్.
21వ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం
ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ నగరంలో 21వ కామన్వెల్త్ గేమ్స్ ఏప్రిల్ 4న ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో 23 క్రీడాంశాల్లో 71 దేశాల నుంచి 6,600 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. భారత్ తరఫున మొత్తం 218 మంది క్రీడాకారులు 17 క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు. ఈ గేమ్స్లో భారత బృందానికి పతాకాధారిగా పీవీ సింధు వ్యవహరించింది.
కామన్వెల్త్ గేమ్స్ పతకాల విషయంలో 12 సార్లు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో పాల్గొన్న 11 ఏళ్ల వేల్స్ చిన్నారి అనా హర్సె అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.
షూటింగ్ జూనియర్ ప్రపంచకప్లో రెండో స్థానం
సిడ్నీలో జరిగిన షూటింగ్ జూనియర్ ప్రపంచకప్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 22 పతకాలను కైవసం చేసుకోగా, చైనా 9 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్యాలతో మొత్తం 25 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
సెంథిల్కు పీఎస్ఏ వరల్డ్ టూర్ టైటిల్
భారత స్క్వాష్ ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) వరల్డ్ టూర్ టైటిల్ను గెలుచుకున్నాడు. అమెరికాలో ఏప్రిల్ 23న జరిగిన మాడిసన్ ఓపెన్ ఫైనల్లో సెంథిల్ నాలుగో సీడ్ ట్రిస్టన్ ఐజెల్(దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. ప్రపంచ 255వ ర్యాంకర్ అయిన సెంథిల్ పీఎస్ఏ ఈవెంట్లలో రెండుసార్లు రన్నరప్గా నిలిచాడు.
ప్రపంచ కప్ షూటింగ్లో రిజ్వీకి రజతం
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ షాజర్ రిజ్వీ రజతం గెల్చుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రిజ్వీ 239.8 పాయింట్లు స్కోరు చేశాడు. 240 పాయింట్లు సాధించి ఆర్తెమ్ చెర్నుసోవ్ (రష్యా) స్వర్ణం దక్కించుకోగా, 217.1 పాయింట్లతో సముయిల్ డాన్కోవ్ (బల్గేరియా) కాంస్యం అందుకున్నాడు. 2018 మార్చిలో మెక్సికోలో జరిగిన తొలి ప్రపంచ కప్లో రిజ్వీ స్వర్ణం గెలిచాడు.
డబుల్ ట్రాప్ ఈవెంట్లో శ్రేయసికి స్వర్ణం కామన్వెల్త్ గేమ్స్లో ఏప్రిల్ 11న జరిగిన మహిళల షూటింగ్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో శ్రేయసి సింగ్ స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఎమ్మా కాక్స్ను ఓడించింది. మరోవైపు పురుషుల 50 మీ పిస్టల్ ఈవెంట్లో ఓమ్ మితర్వాల్ కాంస్యం గెలుపొందగా, పురుషుల డబుల్ట్రాప్ విభాగంలో అంకుర్ మిట్టల్ మరో కాంస్యాన్ని సాధించాడు. 2014 ఎడిషన్లో రజతం గెలిచిన శ్రేయసి వచ్చే ఎడిషన్ నుంచి కామన్వెల్త్ గేమ్స్లో షూటింగ్ క్రీడను తొలగిస్తుండ టంతో ఈ పతకం తనకు ప్రత్యేకమని పేర్కొంది.
కామన్వెల్త్ గేమ్స్లో సుశీల్ కుమార్కు స్వర్ణం
భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం గెలుచుకున్నాడు. 74 కేజీల విభాగంలో జోనస్ బోథా (దక్షిణాఫ్రికా)తో ఏప్రిల్ 12న జరిగిన ఫైనల్లో కేవలం 80 సెకన్లలోనే 10-0తో ఆధిక్యంలోకి వెళ్లి విజేతగా నిలిచాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్లో వరుసగా మూడోసారి స్వర్ణ పతకాన్ని గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అంతేకాకుండా ఈ గేమ్స్ చరిత్రలో మూడుసార్లు బంగారు పతకం గెలిచిన ఏకైక భారత రెజ్లర్గా కొత్త చరిత్ర సృష్టించాడు.
అలాగే పురుషుల 57 కేజీల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ రాహుల్ అవారే విజేతగా నిలిచాడు. ఫైనల్లో 15-7తో స్టీవెన్ తకహాషి (కెనడా)పై విజయం సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో బబిత కుమారి 3-5తో డయానా వీకెర్ (కెనడా) చేతిలో ఓడిపోయి రజతం గెలుచుకుంది.
బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో శ్రీకాంత్ కు అగ్రస్థానం
భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఏప్రిల్ 12న ర్యాంకుల్లో నంబర్వన్గా నిలిచాడు. శ్రీకాంత్ ప్రస్తుతం 76,895 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్నాడు. తాజా ర్యాంక్తో కంప్యూటరైజ్డ్ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత పురుషుల సింగిల్స్లో నంబర్వన్ అయిన తొలి భారతీయ ప్లేయర్గా అతను గుర్తింపు పొందాడు. 2015 లో మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ టాప్ ర్యాంక్లో నిలిచింది.
జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్లో సురేఖకు స్వర్ణం
జాతీయ సీనియర్ కాంపౌండ్ ఆర్చరీ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నెం జ్యోతి సురేఖ చాంపియన్గా నిలిచింది. పుణేలో ఏప్రిల్ 12న జరిగిన ఫైనల్లో సురేఖ 145-143తో త్రిషా దేబ్ (ఆర్ఎస్పీబీ)పై గెలుపొంది స్వర్ణం దక్కించుకుంది. గత ఆరేళ్లలో సురేఖ జాతీయ చాంపియన్గా నిలవడం ఇది నాలుగోసారి.
కామన్వెల్త్లో భారత్కు మూడు స్వర్ణాలు
కామన్వెల్త్ గేమ్స్లో ఏప్రిల్ 13 న జరిగిన పలు ఈవెంట్లలో భారత్ మూడు స్వర్ణాలను గెలుచుకుంది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో 15 ఏళ్ల అనీశ్ భన్వాలా(హరియాణా) 30 పాయింట్ల స్కోరు చేసి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో 23 పాయింట్లతో డేవిడ్ చాప్మన్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును అధిగమించడంతో పాటు భారత్ నుంచి స్వర్ణం గెలిచిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు.
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో తేజస్విని(మహారాష్ట్ర) 457.9 పాయింట్లు స్కోరు చేసి 449.1 పాయింట్లతో జియాంగ్ (సింగపూర్) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును చేధించడంతో పాటు స్వర్ణ పథకాన్ని గెలిచింది. ఈ ఈవెంట్లో భారత్కే చెందిన అంజుమ్ (455.7 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకుంది.
రెజ్లింగ్ పురుషుల 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. కేన్ చారిగ్ (వేల్స్)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 10-0తో మూడు నిమిషాల్లోపే బౌట్ను ముగించాడు.
కామన్వెల్త్ గేమ్స్లో ఒకేరోజు 8 స్వర్ణాలు
ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు ఒకే రోజు 8 స్వర్ణాలు గెలుచుకున్నారు. ఇందులో బాక్సింగ్లో మూడు, రెజ్లింగ్లో రెండు, టేబుల్ టెన్నిస్, షూటింగ్, అథ్లెటిక్స్ నుంచి ఒక్కో స్వర్ణం ఉన్నాయి. వీటితో పాటు 5 రజతాలు నాలుగు కాంస్యాలతో మొత్తం 17 పథకాలు దక్కాయి.
స్వర్ణపతకాల వివరాలు
భారత స్క్వాష్ ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) వరల్డ్ టూర్ టైటిల్ను గెలుచుకున్నాడు. అమెరికాలో ఏప్రిల్ 23న జరిగిన మాడిసన్ ఓపెన్ ఫైనల్లో సెంథిల్ నాలుగో సీడ్ ట్రిస్టన్ ఐజెల్(దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. ప్రపంచ 255వ ర్యాంకర్ అయిన సెంథిల్ పీఎస్ఏ ఈవెంట్లలో రెండుసార్లు రన్నరప్గా నిలిచాడు.
ప్రపంచ కప్ షూటింగ్లో రిజ్వీకి రజతం
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ షాజర్ రిజ్వీ రజతం గెల్చుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రిజ్వీ 239.8 పాయింట్లు స్కోరు చేశాడు. 240 పాయింట్లు సాధించి ఆర్తెమ్ చెర్నుసోవ్ (రష్యా) స్వర్ణం దక్కించుకోగా, 217.1 పాయింట్లతో సముయిల్ డాన్కోవ్ (బల్గేరియా) కాంస్యం అందుకున్నాడు. 2018 మార్చిలో మెక్సికోలో జరిగిన తొలి ప్రపంచ కప్లో రిజ్వీ స్వర్ణం గెలిచాడు.
డబుల్ ట్రాప్ ఈవెంట్లో శ్రేయసికి స్వర్ణం కామన్వెల్త్ గేమ్స్లో ఏప్రిల్ 11న జరిగిన మహిళల షూటింగ్ డబుల్ ట్రాప్ ఈవెంట్లో శ్రేయసి సింగ్ స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఎమ్మా కాక్స్ను ఓడించింది. మరోవైపు పురుషుల 50 మీ పిస్టల్ ఈవెంట్లో ఓమ్ మితర్వాల్ కాంస్యం గెలుపొందగా, పురుషుల డబుల్ట్రాప్ విభాగంలో అంకుర్ మిట్టల్ మరో కాంస్యాన్ని సాధించాడు. 2014 ఎడిషన్లో రజతం గెలిచిన శ్రేయసి వచ్చే ఎడిషన్ నుంచి కామన్వెల్త్ గేమ్స్లో షూటింగ్ క్రీడను తొలగిస్తుండ టంతో ఈ పతకం తనకు ప్రత్యేకమని పేర్కొంది.
కామన్వెల్త్ గేమ్స్లో సుశీల్ కుమార్కు స్వర్ణం
భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం గెలుచుకున్నాడు. 74 కేజీల విభాగంలో జోనస్ బోథా (దక్షిణాఫ్రికా)తో ఏప్రిల్ 12న జరిగిన ఫైనల్లో కేవలం 80 సెకన్లలోనే 10-0తో ఆధిక్యంలోకి వెళ్లి విజేతగా నిలిచాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్లో వరుసగా మూడోసారి స్వర్ణ పతకాన్ని గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అంతేకాకుండా ఈ గేమ్స్ చరిత్రలో మూడుసార్లు బంగారు పతకం గెలిచిన ఏకైక భారత రెజ్లర్గా కొత్త చరిత్ర సృష్టించాడు.
అలాగే పురుషుల 57 కేజీల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ రాహుల్ అవారే విజేతగా నిలిచాడు. ఫైనల్లో 15-7తో స్టీవెన్ తకహాషి (కెనడా)పై విజయం సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో బబిత కుమారి 3-5తో డయానా వీకెర్ (కెనడా) చేతిలో ఓడిపోయి రజతం గెలుచుకుంది.
బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో శ్రీకాంత్ కు అగ్రస్థానం
భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఏప్రిల్ 12న ర్యాంకుల్లో నంబర్వన్గా నిలిచాడు. శ్రీకాంత్ ప్రస్తుతం 76,895 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉన్నాడు. తాజా ర్యాంక్తో కంప్యూటరైజ్డ్ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత పురుషుల సింగిల్స్లో నంబర్వన్ అయిన తొలి భారతీయ ప్లేయర్గా అతను గుర్తింపు పొందాడు. 2015 లో మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ టాప్ ర్యాంక్లో నిలిచింది.
జాతీయ ఆర్చరీ చాంపియన్షిప్లో సురేఖకు స్వర్ణం
జాతీయ సీనియర్ కాంపౌండ్ ఆర్చరీ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నెం జ్యోతి సురేఖ చాంపియన్గా నిలిచింది. పుణేలో ఏప్రిల్ 12న జరిగిన ఫైనల్లో సురేఖ 145-143తో త్రిషా దేబ్ (ఆర్ఎస్పీబీ)పై గెలుపొంది స్వర్ణం దక్కించుకుంది. గత ఆరేళ్లలో సురేఖ జాతీయ చాంపియన్గా నిలవడం ఇది నాలుగోసారి.
కామన్వెల్త్లో భారత్కు మూడు స్వర్ణాలు
కామన్వెల్త్ గేమ్స్లో ఏప్రిల్ 13 న జరిగిన పలు ఈవెంట్లలో భారత్ మూడు స్వర్ణాలను గెలుచుకుంది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో 15 ఏళ్ల అనీశ్ భన్వాలా(హరియాణా) 30 పాయింట్ల స్కోరు చేసి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో 23 పాయింట్లతో డేవిడ్ చాప్మన్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును అధిగమించడంతో పాటు భారత్ నుంచి స్వర్ణం గెలిచిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు.
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో తేజస్విని(మహారాష్ట్ర) 457.9 పాయింట్లు స్కోరు చేసి 449.1 పాయింట్లతో జియాంగ్ (సింగపూర్) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును చేధించడంతో పాటు స్వర్ణ పథకాన్ని గెలిచింది. ఈ ఈవెంట్లో భారత్కే చెందిన అంజుమ్ (455.7 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకుంది.
రెజ్లింగ్ పురుషుల 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. కేన్ చారిగ్ (వేల్స్)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 10-0తో మూడు నిమిషాల్లోపే బౌట్ను ముగించాడు.
కామన్వెల్త్ గేమ్స్లో ఒకేరోజు 8 స్వర్ణాలు
ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారులు ఒకే రోజు 8 స్వర్ణాలు గెలుచుకున్నారు. ఇందులో బాక్సింగ్లో మూడు, రెజ్లింగ్లో రెండు, టేబుల్ టెన్నిస్, షూటింగ్, అథ్లెటిక్స్ నుంచి ఒక్కో స్వర్ణం ఉన్నాయి. వీటితో పాటు 5 రజతాలు నాలుగు కాంస్యాలతో మొత్తం 17 పథకాలు దక్కాయి.
స్వర్ణపతకాల వివరాలు
- పురుషుల జావెలిన్ త్రోలో 86.47 మీటర్ల దూరం జావెలిన్ విసిరి నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో జావెలిన్ విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణం. 2010 ఢిల్లీ క్రీడల్లో కాశీనాథ్ నాయక్ కాంస్యం సాధించాడు.
- బాక్సింగ్లో ఆరుగురు ఫైనల్లోకి చేరగా... మేరీకోమ్, గౌరవ్ సోలంకి (52 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) స్వర్ణాలు గెలిచారు. అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) రజతాలు గెల్చుకున్నారు. మహిళల 48 కేజీల ఫైనల్లో మేరీకోమ్ 5-0తో క్రిస్టినా ఒహారా (నార్తర్న్ ఐర్లాండ్)పై గెలిచి ఈ గేమ్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా బాక్సర్గా నిలిచింది.
- షూటింగ్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ ఫైనల్లో సంజీవ్ రాజ్పుత్ 454.5 పాయింట్లు స్కోరు చేసి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకం గెలిచాడు.
- టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే టీమ్ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్లో రజత పతకాలను గెలుచుకున్న మనిక బాత్రా సింగిల్స్లోనూ మరో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. తద్వారా కామన్వెల్త్ క్రీడల చరిత్రలో టీటీలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా మనిక ఘనత సాధించింది.
- రెజ్లింగ్లో నాలుగు విభాగాల్లో భారత్కు రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ స్వర్ణ పతకం గెలుచుకోగా, పురుషుల 125 కేజీల విభాగంలో సుమీత్ స్వర్ణం దక్కించుకున్నాడు.
కామన్వెల్త్గేమ్స్లో సైనాకు స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో సైనా నెహ్వాల్ స్వర్ణ పతకం గెలుచుకుంది. సైనా 21-18, 23-21 తేడాతో పీవీ సింధుపై విజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో సైనాకిది రెండో స్వర్ణం. ఇంతకుముందు 2010లో ఢిల్లీలో జరిగిన క్రీడల్లోనూ స్వర్ణం గెలుచుకుంది.
అలాగే బ్యాట్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ రజతం గెల్చుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట 13-21, 16- 21తో మార్కస్ ఎలిస్-క్రిస్ లాన్గ్రిడ్జ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడి రజతం గెలిచారు.
ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2018
ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో ఏప్రిల్ 4న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ 15న ముగిశాయి. 12 రోజుల పాటు జరిగిన ఈ గేమ్స్లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు మొత్తం 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ గేమ్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పి.వి.సింధు పతాకధారిగా వ్యవహరించగా ముగింపు వేడుకల్లో మేరీకోమ్ నేతృత్వం వహించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్హామ్ (ఇంగ్లండ్) లో జరగనున్నాయి.
కామన్వెల్త్ గేమ్స్ 2018 పతకాల పట్టిక
స్థానం
|
దేశం
|
స్వ
|
ర
|
కాం
|
మొ
|
1
|
ఆస్ట్రేలియా
|
80
|
59
|
59
|
198
|
2
|
ఇంగ్లండ్
|
45
|
45
|
46
|
136
|
3
|
భారత్
|
26
|
20
|
20
|
66
|
4
|
కెనడా
|
15
|
40
|
27
|
82
|
5
|
న్యూజిలాండ్
|
15
|
16
|
15
|
46
|
6
|
దక్షిణాఫ్రికా
|
13
|
11
|
13
|
37
|
7
|
వేల్స్
|
10
|
12
|
14
|
36
|
8
|
స్కాట్లాండ్
|
9
|
13
|
22
|
44
|
9
|
నైజీరియా
|
9
|
9
|
6
|
24
|
10
|
సైప్రస్
|
8
|
1
|
5
|
14
|
చైనా గ్రాండ్ప్రి విజేత రికియార్డో
ఫార్ములావన్ చైనా గ్రాండ్ప్రిలో ఆస్ట్రేలియాకు చెందిన రెడ్బుల్ డ్రైవర్ రికియార్డో విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 15న జరిగిన ప్రధాన రేసులో రికియార్డో 56 ల్యాప్ల రేసును గంటా 35 నిమిషాల 36.380 సెకన్లలో పూర్తి చేశాడు. తన కెరీర్లో అతనికిది ఆరో విజయం. మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్, రెకోనెన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ సీజన్లో ఇప్పటికే రెండు రేసుల్ని గెలిచిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్ప్రి ఏప్రిల్ 29న జరుగుతుంది.
క్రికెట్ ప్రసారహక్కులు దక్కించుకున్న స్టార్ ఇండియా భారత్లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల ప్రసారహక్కులను అత్యధిక మొత్తానికి స్టార్ ఇండియా దక్కించుకుంది. వేలంలో స్టార్ రూ. 6 వేల 138 కోట్ల 10 లక్షలకు హక్కులు గెలుచుకుంది. దీంతో వచ్చే ఐదేళ్ల (2018-2023) లో భారత్లో జరిగే మ్యాచ్ల ప్రపంచవ్యాప్త టీవీ ప్రసారాలు, డిజిటల్ ప్రసారాల గ్లోబల్ కన్సాలిడేటెడ్ బిడ్ (జీసీఆర్) స్టార్ సొంతమైంది. ఐదేళ్ల క్రితం ప్రసార హక్కుల కోసం స్టార్ రూ.3,851 కోట్లు చెల్లించింది.
కామన్వెల్త్ గేమ్స్లో మీరాబాయికి స్వర్ణం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ మీరాబాయి చాను విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకుంది. చాను మొత్తం (స్నాచ్లో 86+క్లీన్ అండ్ జెర్క్లో 110) 196 కేజీలు బరువెత్తి అగ్రస్థానాన్ని సంపాదించింది. మేరీ హనిత్రా రనైవొసోవా (మారిషస్-170 కేజీలు) రజతం, దినుషా గోమ్స్ (శ్రీలంక-155 కేజీలు) కాంస్యం పొందారు.
పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా 249 కేజీలు (స్నాచ్లో 111+క్లీన్ అండ్ జెర్క్ లో 138) బరువెత్తి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మొహమ్మద్ ఇజర్ అహ్మద్ (మలేసియా - 261 కేజీలు) స్వర్ణం... చతురంగ లక్మల్ (శ్రీలంక-248 కేజీలు) కాంస్యం గెలిచారు.
బెర్ముడా కు తొలి స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్లో బెర్ముడా కు చెందిన మహిళా ట్రయాథ్లెట్ ఫ్లోరా డఫీ తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్) రేసును ఆమె 56 నిమిషాల 50 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.
ఐపీఎల్ సీజన్-11 ప్రారంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదకొండో సీజన్ ఏప్రిల్ 7న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సీజన్లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఐపీఎల్ ఫైనల్ను మే 27న వాంఖడే స్టేడియంలోనే నిర్వహిస్తారు. నిషేధం కారణంగా రెండు సీజన్ల పాటు లీగ్కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తిరిగి పునరాగమనం చేశాయి.
వెయిట్ లిఫ్టింగ్లో సంజిత చానుకు స్వర్ణం
కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు చెందిన వెయిట్ లిఫ్టర్ సంజిత చాను స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 53 కేజీల విభాగంలో మొత్తం (స్నాచ్లో 84 + క్లీన్ అండ్ జెర్క్లో 108) 192 కేజీల బరువునెత్తి విజేతగా నిలిచింది. లొవా దికా టొవా (182 కేజీలు-పపువా న్యూగినియా) రజతం, రచెల్ (181 కేజీలు - కెనడా) కాంస్యం గెలిచారు.
పురుషుల 69 కేజీల విభాగంలో 18 ఏళ్ల దీపక్ లాథర్ కాంస్యం నెగ్గి, కామన్వెల్త్ గేమ్స్లో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి భారత లిఫ్టర్గా రికార్డులకెక్కాడు.
కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు ఐదు స్వర్ణాలు
కామన్వెల్త్ గేమ్స్లో భారత వెయిట్ లిఫ్టర్లు మూడు స్వర్ణాలు గెలుచుకున్నారు. ఏప్రిల్ 7న జరిగిన పురుషుల 85 కేజీల ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కు చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్లో 151 + క్లీన్ అండ్ జెర్క్లో 187) బరువెత్తి స్వర్ణం దక్కించుకున్నాడు. మరో ఈవెంట్ పురుషుల 77 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ 317 కేజీలు (స్నాచ్లో 144 + క్లీన్ అండ్ జెర్క్లో 173) బరువెత్తి అగ్రస్థానం దక్కించుకున్నాడు.
మహిళల 69 కేజీల విభాగంలో 22 ఏళ్ల పూనమ్ యాదవ్(ఉత్తరప్రదేశ్) మొత్తం 222 కేజీలు (స్నాచ్లో 100+క్లీన్ అండ్ జెర్క్లో 122) బరువెత్తి బంగారు పతకాన్ని గెల్చుకోగా, పురుషుల 94 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ (పంజాబ్) కాంస్య పతకాన్ని సాధించాడు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 16 ఏళ్ల మను భాకర్ ( హరియాణ) స్వర్ణం గెలుచుకుంది. పిన్న వయసులో స్వర్ణం నెగ్గిన భారత షూటర్గా ఆమె గుర్తింపు పొందింది. హీనా సిద్ధూ 234 పాయింట్లు సాధించి రజతం, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రవి కుమార్ కాంస్యాన్ని గెలుచుకున్నారు.
భారత మహిళల టీటీ జట్టు ఫైనల్లో 3-1తో సింగపూర్ను ఓడించి కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి బంగారు పతకాన్ని గెలుచుకుంది.
బహ్రెయిన్ గ్రాండ్ప్రి విజేత వెటెల్
ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బహ్రెయిన్ గ్రాండ్ప్రి టైటిల్ను గెలుచుకున్నాడు. ఏప్రిల్ 8న జరిగిన 57 ల్యాప్ల ఈ రేసును వెటెల్ గంటా 32 నిమిషాల 1.940 సెకన్లలో పూర్తి చేశాడు. బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానం, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. వెటెల్కు ఈ సీజన్లో ఇది రెండో టైటిల్. ఇది వరకే ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రిలోనూ వెటెల్ టైటిల్ గెల్చుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ కు మరో మూడు స్వర్ణాలు
కామన్వెల్త్ గేమ్స్లో ఏప్రిల్ 9న జరిగి పలు ఈవెంట్లలో భారత ఆటగాళ్లు మూడు స్వర్ణాలు గెలుచుకున్నారు. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 3-1తో మలేసియాను ఓడించి విజేత గా నిలిచింది.
టేబుల్ టెన్నిస్లో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. నైజీరియాతో జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో విజయం సాధించింది. 2002లో కామన్వెల్త్ గేమ్స్లో టీటీ ప్రవేశ పెట్టాక రెండు టీమ్ ఈవెంట్స్లో భారత్కు బంగారు పతకాలు రావడం ఇదే తొలిసారి.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 235.1 పాయింట్లు స్కోరు చేసి జీతూరాయ్ స్వర్ణం గెలిచాడు. మరో షూటర్ ఓం మితర్వల్ 214.3 పాయింట్ల స్కోరుతో కాంస్యం దక్కించుకున్నాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెహులీ ఘోష్ (247.2 పాయింట్లు) రజతం, అపూర్వీ చండిలా (225.3 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు.
25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో హీనాకు స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్లో ఏప్రిల్ 10న జరిగిన 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో హీనా సిద్ధూ స్వర్ణం గెలిచింది. ఫైనల్లో హీనా 38 పాయింట్లు స్కోరు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా గలియబోవిచ్ 35 పాయింట్లు సాధించి రజతం గెల్చుకోగా అలా సజానా అజహరి (మలేసియా-26 పాయింట్లు) కాంస్యం దక్కించుకుంది. హీనా ఇదివరకే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజతం నెగ్గింది.
బాల్ టాంపరింగ్ వివాదంలో స్మిత్, వార్నర్లపై ఏడాది నిషేధంక్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనలను అతిక్రమించినందుకు ముగ్గురు ఆటగాళ్లపై తగిన చర్యలు తీసుకున్నట్లు సీఏ మార్చి 28న ప్రకటించింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ల పై ఏడాది, బాన్క్రాఫ్ట్ పై 9 నెలలు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతోపాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వీరు ముగ్గురు బాల్ టాంపరింగ్కు పాల్పడినట్లు వీడియోలో రికార్డయింది.
స్టీవ్ స్మిత్, వార్నర్పై సీఏ ఏడాది నిషేధం విధించిన నేపథ్యంలో బీసీసీఐ వారిని ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పించింది.
సంతోష్ ట్రోఫీ విజేత కేరళ
జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీలో కేరళ జట్టు విజేతగా నిలిచింది. ఏప్రిల్ 1న కోల్కతాలో జరిగిన ఫైనల్లో కేరళ 4-2తో బెంగాల్పై విజయం సాధించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజేతగా నిలిచిన కేరళకు ఈ ట్రోఫీలో ఇది ఆరో టైటిల్.
21వ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం
ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్ నగరంలో 21వ కామన్వెల్త్ గేమ్స్ ఏప్రిల్ 4న ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో 23 క్రీడాంశాల్లో 71 దేశాల నుంచి 6,600 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. భారత్ తరఫున మొత్తం 218 మంది క్రీడాకారులు 17 క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు. ఈ గేమ్స్లో భారత బృందానికి పతాకాధారిగా పీవీ సింధు వ్యవహరించింది.
కామన్వెల్త్ గేమ్స్ పతకాల విషయంలో 12 సార్లు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్లో పాల్గొన్న 11 ఏళ్ల వేల్స్ చిన్నారి అనా హర్సె అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.
షూటింగ్ జూనియర్ ప్రపంచకప్లో రెండో స్థానం
సిడ్నీలో జరిగిన షూటింగ్ జూనియర్ ప్రపంచకప్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 22 పతకాలను కైవసం చేసుకోగా, చైనా 9 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్యాలతో మొత్తం 25 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
No comments:
Post a Comment