Sunday, 9 July 2017

జూన్ 2017 స్పోర్ట్స్

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ విజేత శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. జూన్ 25న జరిగిన ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 22-20, 21-16తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ లాంగ్ (చైనా)పై విజయం సాధించాడు. తద్వారా 56,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 36 లక్షల 28 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లను శ్రీకాంత్‌కు దక్కాయి. 
జూన్ 18న శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్‌ను నెగ్గాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది నాలుగో సూపర్ సిరీస్ టైటిల్. 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో, 2015లో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో శ్రీకాంత్ చాంపియన్‌గా నిలిచాడు. 
 

గెర్రీ వెబెర్ హాల్ ఓపెన్ టైటిల్ విజేత ఫెడరర్ గెర్రీ వెబెర్ హాల్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తొమ్మిదోసారి గెలుచుకున్నాడు. జూన్ 25న జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6-1, 6-3తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. తద్వారా కెరీర్‌లో 92వ సింగిల్స్ టైటిల్ సాధించిన ఫెడరర్... ఓపెన్ శకంలో (1968 తర్వాత) ఒకే టోర్నమెంట్‌ను అత్యధికసార్లు గెలిచిన క్రీడాకారుల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ రికార్డు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (ఫ్రెంచ్ ఓపెన్, బార్సిలోనా ఓపెన్, మోంటెకార్లో ఓపెన్-10 సార్లు చొప్పున) పేరిట ఉంది. 


అజర్‌బైజాన్ గ్రాండ్ ప్రీ విజేత రికియార్డోరెడ్‌బుల్ జట్టు డ్రైవర్ డానియల్ రికియార్డో అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును రికియార్డో రెండు గంటల 3 నిమిషాల 55.570 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన హామిల్టన్ (మెర్సిడెస్) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బొటాస్ (మెర్సిడెస్), స్ట్రాల్ (విలియమ్స్) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్ ఒకాన్ ఆరో స్థానాన్ని పొందాడు.


‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’గా సింధుభారత స్పోర్‌‌ట్స జర్నలిస్ట్ సమాఖ్య (ఎస్‌జేఎఫ్‌ఐ) వార్షిక అవార్డుల్లో భాగంగా అందించే ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంపికైంది. జూన్ 25న జరిగిన ఎస్‌జేఎఫ్‌ఐ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 
2016 డిసెంబర్‌లో లక్నోలో జరిగిన జూనియర్ హాకీ వరల్డ్ కప్‌ను నెగ్గిన భారత హాకీ జట్టు ‘బెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును గెలుచుకుంది. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు క్రీడాకారుల ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని అవార్డులను ప్రకటించినట్లు ఎస్‌జేఎఫ్‌ఐ పేర్కొంది. ఈ అవార్డులను సెప్టెంబర్‌లో అందజేయనున్నారు. 


పేస్ జంటకు ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టైటిల్ఎగాన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను లియాండర్ పేస్, ఆదిల్ షమస్దీన్(కెనడా) జంట కైవసం చేసుకుంది. బ్రిటన్‌లో జూన్ 25న జరిగిన ఫైనల్లో పేస్-షమస్దీన్ ద్వయం 2-6, 6-2, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో బ్రిడాన్ క్లియెన్-జోసాలిస్‌బరీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. 
45 ఏళ్ల పేస్ ఈ సీజన్‌లో తలాసీ, లియోన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లోనూ టైటిల్స్ సాధించాడు.


లోధా సంస్కరణల అమలుకు ప్రత్యేక కమిటీ లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలు కోసం ఏడుగురు సభ్యులతో బీసీసీఐ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. జూన్ 26న జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి రాజీవ్ శుక్లా చైర్మన్‌గా... బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సభ్యుడిగా ఉంటారు. మిగతా సభ్యుల్లో టీసీ మ్యాథ్యూ (కేరళ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షులు), నబా భట్టాచార్జీ (మేఘాలయ క్రికెట్ సంఘం కార్యదర్శి), జయ్ షా (బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు, గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి), బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి ఉన్నారు. 
ఈ కమిటీ లోధా సంస్కరణల అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై నివేదిక ఇవ్వనుంది. 


ప్రపంచ త్రోబాల్ గేమ్స్‌లో భారత్‌కు 2 స్వర్ణాలుఖట్మండ్‌లో జరిగిన ప్రపంచ త్రోబాల్ గేమ్‌లో భారత్‌కు చెందిన మహిళ, పురుష జట్లు చెరో బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాయి. మహిళా జట్టు 15-13, 12-12లతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఇక పురుషుల జట్టు.. బంగ్లాదేశ్‌పై 15-13, 15-12లతో విజయకేతనం ఎగరవేసింది. భారత్ ఈ పోటీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. 
జూన్ 15 నుంచి 18 వరకు జరిగిన ఈ పోటీలను ఇంటర్నేషనల్ స్పోర్‌‌ట్స కౌన్సిల్ (కెనడా) నిర్వహించింది. 


వన్డేల్లో 8 వేల పరుగులు చేసిన కోహ్లీఅంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో వేగంగా 8 వేల పరుగులు మైలు రాయిని దాటిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో మ్యాచ్‌లో కోహ్లీ 78 బంతుల్లో 96 పరుగులు సాధించాడు. తద్వారా ఇప్పటి వరకూ దక్షి ణాఫ్రికా ప్లేయర్ ఏబీ డెవిలియర్స్ పేరిట ఉన్న (182 ఇన్నింగ్స్ ) రికార్డును కోహ్లీ తన 175వ ఇన్నింగ్స్‌లోనే అధిగమించాడు. 


ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్తాన్ 2017 చాంపియన్‌‌స ట్రోఫీని పాకిస్తాన్ కైవసం చేసుకుంది. జూన్ 18న లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన ఫైనల్‌లో పాక్ 180 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. తద్వారా తొలిసారి చాంపియన్స్ ట్రోఫీని అందుకున్న పాకిస్తాన్.. ఐసీసీ మూడు టోర్నీలూ (వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్, చాంపియన్స్ ట్రోఫీ) గెలుచుకున్న మూడో జట్టుగా గుర్తింపు పొందింది. పాక్ కంటే ముందు భారత్, వెస్టిండీస్ ఈ మూడో టోర్నీలను గెలుపొందాయి. 
టోర్నీలో అత్యధిక పరుగులు (338) చేసిన శిఖర్ ధావన్‌కు ‘గోల్డెన్ బ్యాట్’ అవార్డు దక్కగా, అత్యధిక వికెట్లు (13) తీసిన పాక్ పేసర్ హసన్ అలీ ‘గోల్డెన్ బాల్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు. 


ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత శ్రీకాంత్ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ గెలుచుకున్నాడు. జూన్ 18న జరిగిన ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ కేవలం 37 నిమిషాల్లోనే 21-11, 21-19తో ప్రపంచ 47వ ర్యాంకర్ కజుమాసా సకాయ్ (జపాన్)పై గెలిచాడు. తద్వారా పురుషుల సింగిల్స్‌లో ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడుగా గుర్తింపు పొందాడు. ఈ విజయంతో రూ. 75 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 48 లక్షలు 33 వేలు) సొంతం చేసుకున్నాడు. 
ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్, 2015 ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో శ్రీకాంత్ చాంపియన్‌గా నిలిచాడు. 


జూనియర్ చెస్ మీట్‌లో భారత బాలికకు కాంస్యంబ్రిటన్‌లో జరుగుతున్న జూనియర్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్నీలో ముంబైకి చెందిన అహనా షా కాంస్యాన్ని దక్కించుకుంది. అండర్-7 విభాగంలో పోటీపడిన షా.. ఐదింటికి నాలుగు పాయింట్లు సాధించింది. ఈ టోర్నీలో ఎలాంటి రేటింగ్ లేకుండా పాల్గొన్న ఏడేళ్ల షాకు కాంస్యం దక్కగా రిత్విక్, డెసైన్‌లకు స్వర్ణ, రజత పతకాలు దక్కాయి. 


కోచ్ పదవికి కుంబ్లే రాజీనామాభారత జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జూన్ 20న ప్రకటించారు. కాంట్రాక్ట్ ప్రకారం ఆయన పదవీ కాలం జూన్ 20నే ముగియనున్నందున రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా భారత జట్టు కెప్టెన్ కోహ్లీ, ఆటగాళ్లు, కుంబ్లేకు మధ్య వివాదం నడుస్తుందని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కుంబ్లే ఒప్పుకుంటే ఆయన విండీస్ పర్యటనకు వెళతారని ఇటీవలే సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. 


కాపాబ్లాంకా స్మారక చెస్ టోర్నీ విజేత శశికిరణ్ప్రపంచ మాజీ చాంపియన్ జోస్ రౌల్ కాపాబ్లాంకా (క్యూబా) స్మారకార్థం నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కృష్ణన్ శశికిరణ్ విజేతగా నిలిచాడు. క్యూబాలోని వారాడెరోలో జరిగిన ఈ టోర్నీలో శశికిరణ్ మూడు గేముల్లో గెలిచి, ఏడింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. తద్వారా 1962 నుంచి జరుగుతోన్న కాపాబ్లాంకా చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శశికిరణ్ గుర్తింపు పొందాడు. 


ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విజేత బోపన్న, దబ్రౌస్కీ 
ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను భారత డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా) కైవసం చేసుకున్నారు. ఈ మేరకు జూన్ 8న జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ఏడో సీడ్ బోపన్న-దబ్రౌస్కీ జోడీ 2-6, 6-2, 12-10తో ‘సూపర్ టైబ్రేక్’లో అన్‌సీడెడ్ ద్వయం అనాలెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ)-రాబర్ట్ ఫరా (కొలంబియా)పై గెలిచింది. విజేతగా నిలిచిన బోపన్న జోడీకి 1,18,000 యూరోలు (రూ. 85 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
తొమ్మిదేళ్ల కెరీర్‌లో బోపన్నకు ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. అలాగే ఈ విజయంతో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డబుల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన నాలుగో భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో మహేశ్ భూపతి, లియాండర్ పేస్, సానియా మీర్జా డబుల్స్ విభాగాల్లో గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించారు. 


విదేశాల్లో ఎంఎస్ ధోని సిక్సర్ల రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని విదేశాల్లో అత్యధిక అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 8న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోని 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. తద్వారా ఇప్పటి వరకు భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ పేరిట ఉన్న ఈ రికార్డును ధోని అధిగమించాడు. 296 విదేశీ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో గంగూలీ 159 సిక్సర్లు కొట్టగా, ఆ రికార్డును 281 మ్యాచ్‌ల్లో 161 సిక్సర్లతో ధోని అధిగమించాడు. 


ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఒస్టాపెంకోఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను లాత్వియా క్రీడాకారిణి 20 ఏళ్ల జెలెనా ఒస్టాపెంకో కైవసం చేసుకుంది. పారిస్‌లోని రొలాండ్ గారోస్‌లో జూన్ 10న గంటా 59 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ ఒస్టాపెంకో 4-6, 6-4, 6-3తో మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను అందుకుంది. అలాగే 21 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 10 లక్షలు) ప్రైజ్‌మనీని పొందింది. 
ఒస్టాపెంకో విజయం విశేషాలు
  • 1933లో మార్గరెట్ స్క్రివెన్ వివియన్ (బ్రిటన్) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు.
  • కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీని గెలుచుకున్న మూడో ప్లేయర్. మహిళల విభాగంలో బార్బరా జోర్డాన్ (1979 ఆస్ట్రేలియన్ ఓపెన్) ముందుగా ఈ రికార్డు నెలకొల్పగా... 1997 జూన్ 8న గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్) కూడా దానిని సాధించాడు. అదే రోజు పుట్టిన ఒస్టాపెంకో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అలాంటి విజయాన్ని అందుకుంది.
  • కేవలం 20 లక్షల జనాభా ఉన్న యూరోపియన్ దేశం లాత్వియా నుంచి గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు.


ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత నాదల్ 
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ సొంతం చేసుకున్నాడు. పారిస్‌లోని రొలాండ్ గారోస్‌లో జూన్ 11న జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ నాదల్ 6-2, 6-3, 6-1తో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. తద్వారా కెరీర్‌లో పదోసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను నెగ్గిన నాదల్.. ఒకే గ్రాండ్‌స్లామ్‌ను పదిసార్లు గెలిచిన ఏకై క ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు. దీంతో నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య 15కు (రెండో స్థానం) చేరుకుంది. 18 టైటిల్స్‌తో ఫెడరర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 14 టైటిల్స్‌తో పీట్ సంప్రాస్ మూడో స్థానంలో ఉన్నాడు. 
ఓవరాల్‌గా నాదల్ కెరీర్‌లో ఇది 73వ సింగిల్స్ టైటిల్ కాగా క్లే కోర్టులపై 53వది. 
 

ఫిఫా అండర్-20 ప్రపంచకప్ చాంపియన్ ఇంగ్లండ్దక్షిణకొరియాలో జరిగిన ఫిఫా అండర్-20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. జూన్ 11న జరిగిన ఫైనల్లో 1-0తో వెనిజులాపై విజయం సాధించడం ద్వారా ఇంగ్లిష్ జట్టు 51 ఏళ్ల తర్వాత ప్రపంచ స్థాయి టైటిల్‌ను దక్కించుకుంది. 
టోర్నీలో అత్యుత్తమంగా రాణించిన ఇంగ్లండ్ ప్లేయర్ డొమినిక్ సొలంకి గోల్డెన్ బాల్ పురస్కారం అందుకున్నాడు. బెస్ట్ గోల్ కీపర్‌కి ఇచ్చే గోల్డెన్ గ్లోవ్ అవార్డు ఇంగ్లండ్ జట్టుకే చెందిన ఉడ్‌మెన్‌కు దక్కింది. 


కెనడా గ్రాండ్ ప్రీ విజేత లూయిస్ హామిల్టన్ మాంట్రియాల్‌లో జరిగిన కెనడా గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతం చేసుకున్నాడు. జూన్ 12న జరిగిన ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచిన హామిల్టన్ వరుసగా మూడోసారి ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 2015, 2016లోనూ ఈ రేసులో హామిల్టన్ గెలిచాడు. 
ఈ రేసులో మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరీ బొటాస్ రెండో స్థానంలో నిలువగా... రికియార్డో (రెడ్‌బుల్), వెటెల్ (ఫెరారీ) వరుసగా మూడు, నాలుగు స్థానాలను సంపాదించారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఎస్టాబెన్ ఒకాన్ వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. 


ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో జీతూ-హీనాకు స్వర్ణం
అజర్‌బైజాన్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల జీతూ రాయ్-హీనా సిద్ధు పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నారు. 10 మీ. ఏయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ విభాగంలో జరిగిన ఫైనల్లో జీతూ జంట 7-6తో రష్యా జోడీపై గెలుపొంది స్వర్ణం గెలుచుకుంది. మరోవైపు ఇరాన్‌ను ఓడించిన ఫ్రాన్స్ కాంస్య పతకాన్ని నెగ్గింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో మొత్తం ఆరు పతకాల (మూడు స్వర్ణాలు)తో చైనా తొలిస్థానంలో నిలిచింది. 


ఐసీసీ టోర్నీల్లో ధావన్ పరుగుల రికార్డు భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ఐసీసీ టోర్నీల్లో వేగంగా వెయి్య పరుగుల్ని సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జూన్ 11న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో ఈ ఘనతను నమోదు చేశాడు. 
ఐసీసీ టోర్నీల్లో వేగవంతమైన వెయి్య పరుగుల్ని సాధించడానికి సచిన్ కు 18 ఇన్నింగ్‌‌స లు అవసరమైతే, ధావన్ 16 ఇన్నింగ్‌‌సల్లోనే పూర్తిచేశాడు.


జాతీయ క్రికెట్ కోచ్‌ల పదవీకాలం రెండేళ్లుభారత క్రికెట్ జట్లకు సంబంధించిన కోచ్‌ల పదవీ కాలం రెండేళ్లపాటు ఉండాలని బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ) నిర్ణయించింది. జూన్ 12 ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఇక నుంచి అన్ని ఒప్పందాలు రెండేళ్ల పాటు ఉంటాయని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ చెప్పారు. దీంతో జాతీయ జట్టు నుంచి అండర్-19 వరకు ఉండే కోచ్‌లు రెండు నెలల పాటు ఐపీఎల్‌లో పనిచేసే అవకాశం కోల్పోనున్నారు. 


బీసీసీఐ పరిపాలకుల కమిటీకి రామచంద్ర గుహ రాజీనామాప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ వ్యక్తిగత కారణాల పేరుతో బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ)కి రాజీనామా చేశారు. కమిటీ నలుగురు సభ్యుల్లో ఒకరైన గుహ బీసీసీఐ, పరిపాలక కమిటీ పనితీరుపై పలు విమర్శలు చేస్తూ చైర్మన్ వినోద్ రాయ్‌కి లేఖ రాశారు. లోధా కమిటీ ఫిపార్సులను అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను తొలగిస్తూ సుప్రీం కోర్టు జనవరిలో నలుగురు సభ్యులతో బీసీసీఐకి పరిపాలకుల కమిటీని ఏర్పాటు చేసింది.
గుహ చేసిన విమర్శలు
- భారత జట్టుకు కోచ్‌లుగా పని చేసేవారు ఐపీఎల్ జట్లకూ కోచ్‌గా వ్యవహరించడం సరికాదు. రాహుల్ ద్రవిడ్, ఆర్.శ్రీధర్, సంజయ్ బంగర్, భరత్ అరుణ్‌లకు ఈ విషయంలో బోర్డు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చింది. ఇదే విషయాన్ని సీఓఏ సమావేశాల్లో పలుసార్లు ప్రస్తావించారు.
- బీసీసీఐ కామెంటరీ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న సునీల్ గావస్కర్ పీఎంజీ అనే ప్లేయర్ మేనేజ్‌మెంట్ కంపెనీకి యజమాని. ఇది శిఖర్ ధావన్, రిషభ్ పంత్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఆయన రెండింటిలో ఏదో ఒకదానికే పరిమితం కావాలి.
- సౌరవ్ గంగూలీ ఒక క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ కామెంటరీ కూడా చేయడం సరికాదు. 
- రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లకు చెల్లింపులు ఒక క్రమపద్ధతిలో ఉండాలి.
- సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అనర్హులైన అనేక మంది బోర్డు, రాష్ట్ర సంఘాల ఆఫీస్ బేరర్లు స్వేచ్ఛగా సమావేశాలకు హాజరయ్యారు. ఈ విషయంలో సీవోఏ సరిగా వ్యవహరించలేదు.
- సీవోఏలో ఒక పురుష క్రికెటర్ లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు వచ్చాయి. కాబట్టి పురుష క్రికెటర్ తప్పనిసరిగా ఉండాలి.
- సూపర్ స్టార్ సంస్కృతి వల్ల కోచ్‌పై తమకు ప్రత్యేక అధికారం ఉందని సీనియర్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా కోచ్‌లు, కామెంటేటర్ల ఎంపిక విషయంలో ఆటగాళ్లు జోక్యం చేసుకోవడం తగదు.
- టెస్టులు ఆడలేనంటూ స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ధోనీకి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వడం సరికాదు.


థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి విజేత సాయిప్రణీత్ 
థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ చాంపియన్‌గా నిలిచాడు. జూన్ 4న 71 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సాయిప్రణీత్ 17-21, 21-18, 21-19తో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. ఈ విజయంతో సాయిప్రణీత్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 80 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. భారత బ్యాడ్మింటన్ సంఘం రూ. 3 లక్షలు నజరానా ప్రకటించింది. 
ఏప్రిల్ నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన సాయిప్రణీత్ కెరీర్‌లో ఇది తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్. 




Sunday, 28 May 2017

మే 2017 స్పోర్ట్స్

బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో సింధుభారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి పూసర్ల వెంకట (పీవీ) సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికైంది. సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్ సందర్భంగా మే 24న నిర్వహించిన ఎన్నికల్లో పీవీ సింధుకు అత్యధికంగా 129 ఓట్లు పడ్డాయి. మొత్తం మూడు స్థానాల కోసం ఎన్నికలు నిర్వహించారు. సింధుతోపాటు మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ-108 ఓట్లు), కిర్‌స్టీ గిల్మూర్ (స్కాట్లాండ్-103 ఓట్లు) కూడా బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్‌లో సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురూ నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. 
 

మొనాకో గ్రాండ్‌ప్రీ విజేత వెటెల్ మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ సొంతం చేసుకున్నాడు. మే 29న జరిగిన 78 ల్యాప్‌ల రేసుని గంటా 44 నిమిషాల 44.340 సెకన్లలో పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచిన వెటెల్.. ఈ సీజన్‌లో మూడో టైటిల్‌ను దక్కించుకున్నాడు. 
భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఒకాన్ వరుసగా 12వ, 13వ స్థానాల్లో నిలిచారు. 


సుదిర్మన్ కప్ విజేత దక్షిణ కొరియా సుదీర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్షిణ కొరియా దక్కించుకుంది. మే 29న జరిగిన ఫైనల్లో కొరియా 3-2 తేడాతో చైనాను ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. 28 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో కొరియా టైటిల్ నెగ్గడం ఇది నాలుగోసారి. గతంలో కొరియా 1991, 1993, 2003లలో చాంపియన్‌గా నిలిచింది. రెండేళ్లకోసారి జరిగే ఈ మెగా ఈవెంట్‌లో చైనా పదిసార్లు విజేతగా నిలిచింది. 


అంతర్జాతీయ ఫెన్సింగ్ టోర్నీలో భవానీకి స్వర్ణంఅంతర్జాతీయ ఫెన్సింగ్ టోర్నమెంట్‌లో భారత ఫెన్సింగ్ క్రీడాకారిణి చదలవాడ భవానీ దేవి స్వర్ణం గెలుచుకుంది. ఐస్‌లాండ్‌లోని రెక్జావిక్‌లో జరిగిన టర్నోయ్ శాటిలైట్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ సాబెర్ ఈవెంట్ ఫైనల్లో భవాని 15-13తో సారా జేన్ హాంప్సన్ (బ్రిటన్)పై విజయం సాధించింది. తద్వారాఈ క్రీడకు సంబంధించిన అంతర్జాతీయ ఈవెంట్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. 
 

ఫిఫా కార్యక్రమానికి ఎంపికైన అనన్య కాంబోజ్ రష్యాలో జూన్ 26 నుంచి జూలై 3 వరకు జరగనున్న ఫుట్‌బాల్ ఫర్ ఫ్రెండ్‌షిప్ (ఎఫ్4ఎఫ్) సామాజిక కార్యక్రమానికి చంఢీగఢ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక అనన్య కాంబోజ్ ఎంపికైంది. ఎనిమిదో తరగతి చదువుతున్న అనన్య ఈ కార్యక్రమంలో విలేకరిగా వ్యవహరించనుంది. చిన్నారుల్లో ఫుట్‌బాల్ క్రీడపై ఆసక్తి పెంపొందించుట కోసం ఫిఫా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 60 దేశాలకు చెందిన చిన్నారులు ఈ ప్రొగ్రామ్‌లో పాల్గొననున్నారు. 
2017 అక్టోబర్‌లో భారత్‌లో జరుగనున్న అండర్-17 ప్రపంచకప్ కోసం ఫిఫా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత్‌కు స్వర్ణం ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నమెంట్ కాంపౌండ్ ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు పసిడి పతకం గెలుచుకుంది. ఈ మేరకు చైనాలోని షాంఘైలో మే 20న జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ, రాజు చిన్న శ్రీధర్, అమన్‌జీత్ సింగ్‌లతో కూడిన భారత జట్టు 226-221 స్కోరుతో కార్డొనా, డానియెల్ మునోజ్, కార్లొస్‌లతో కూడిన కొలంబియా జట్టును ఓడించి విజేతగా నిలిచింది. తద్వారా ప్రపంచకప్ కాంపౌండ్ విభాగం చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. 


ముంబై ఇండియన్‌‌సకు ఐపీఎల్-10 టైటిల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2017 టైటిల్‌ను ముంబై ఇండియన్‌‌స సొంతం చేసుకుంది. మే 21న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై విజయం సాధించిన ముంబై.. మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు లభించింది. 
ఐపీఎల్-10 అవార్డీలు
  • అరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు; రూ.10 లక్షలు) : వార్నర్ (641 పరుగులు; హైదరాబాద్)
  • పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు; రూ.10 లక్షలు) : భువనేశ్వర్ (26 వికెట్లు; హైదరాబాద్)
  • ఫర్‌ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ (రూ.10 లక్షలు) : సురేశ్ రైనా
  • ఎమర్జింగ్ ప్లేయర్ (రూ. 10 లక్షలు) : బాసిల్ థంపీ
  • ఫెయిర్ ప్లే అవార్డు : గుజరాత్ లయన్‌‌స
  • మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 10 లక్షలు) : బెన్ స్టోక్స్
  • రన్నరప్ (రూ. 10 కోట్లు) : రైజింగ్ పుణే సూపర్‌జెయింట్
  • విన్నర్ (రూ. 15 కోట్లు) : ముంబై ఇండియన్‌‌స
ఐపీఎల్ విజేతలు 2008 - రాజస్థాన్ రాయల్స్ 
2009 - డెక్కన్ ఛార్జర్స్ 
2010 - చెన్నై సూపర్ కింగ్స్ 
2011 - చెన్నై సూపర్ కింగ్స్ 
2012 - కోల్‌కతా నైట్ రైడర్స్ 
2013 - ముంబయి ఇండియన్స్ 
2014 - కోల్‌కతా నైట్ రైడర్స్ 
2015 - ముంబయి ఇండియన్స్ 
2016 - సన్‌రైజర్స్ హైదరాబాద్ 
2017 - ముంబయి ఇండియన్స్ 



ఆసియా చెస్‌లో వైశాలికి స్వర్ణంఆసియా సీనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో మహిళల బ్లిట్జ్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి ఆర్.వైశాలి స్వర్ణ పతకం సాధించింది. ఈ మేరకు మే 21న చైనాలో ముగిసిన టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత వైశాలి ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని పసిడి పతకం సొంతం చేసుకుంది. భారత్‌కే చెందిన మరో క్రీడాకారిణి పద్మిని రౌత్ ఏడు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది. 
 


ఆసియా యూత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. ఈ మేరకు మే 22న జరిగిన 10 కిలో మీటర్ల నడక విభాగంలో సంజయ్ కుమార్... డిస్కస్ త్రో ఈవెంట్‌లో అభయ్ గుప్తా విజేతలుగా నిలిచారు. సంజయ్ 45 నిమిషాల 30.39 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణం దక్కించుకోగా.. అభయ్ గుప్తా డిస్క్‌ను 56.47 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. డిస్కస్ త్రోలోనే భారత్‌కే చెందిన సాహిల్ సల్వాల్(54.58 మీటర్లు) రజతం గెల్చుకున్నాడు. 
 

ఆసియా యూత్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు 14 పతకాలుబ్యాంకాక్‌లో జరిగిన ఆసియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ మొత్తం 14 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. చైనా 30 పతకాలతో (16 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలు) అగ్రస్థానాన్ని సంపాదించింది. చైనీస్ తైపీ 15 పతకాలతో (6 స్వర్ణాలు, 7 రజతాలు, 2 కాంస్యాలు) రెండో స్థానంలో నిలిచింది. 


ప్రో కబడ్డీ సీజన్ - 5 వేలం ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్ 5 వేలం మే 23, 24 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. టోర్నీలో పాల్గొంటున్న 12 జట్లు మొత్తం 227 మంది ఆటగాళ్ల కోసం రూ.47 కోట్లు ఖర్చు చేశాయి. ఆటగాళ్ల కోసం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా రూ. 4 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. యు ముంబా అత్యధికంగా రూ.3.98 కోట్లు ఖర్చు చేసింది. పుణెరి పల్టాన్ అత్యల్పంగా రూ. 3.8 కోట్లు వెచ్చించింది. సచిన్ సహ యజమానిగా ఉన్న తమిళనాడు అత్యధికంగా 25 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోగా పుణెరి అత్యల్పంగా 15 మందిని ఎంపిక చేసుకుంది
ఏ ఆటగాడికి ఎంత..
  • పీకేఎల్‌లో కొత్తగా చేరిన ఉత్తరప్రదేశ్ రూ.93 లక్షలకు నితిన్ తోమర్‌ను దక్కించుకుంది. ఈ వేలంలో ఇదే అత్యధికం.
  • రోహిత్ కుమార్ - బెంగళూరు - రూ. 81 లక్షలు
  • మంజీత్ చిల్లార్ - జైపూర్ - రూ. 75.50 లక్షలు
  • సెల్వమణి - జైపూర్ - రూ. 73 లక్షలు
  • రాజేశ్ నర్వాల్ - ఉత్తరప్రదేశ్ - రూ. 69 లక్షలు
పీకేఎల్ - 5 జట్లు
తెలుగు టైటాన్స్బెంగాల్ వారియర్స్
తమిళనాడుదబాంగ్ దిల్లీ
గుజరాత్హరియాణా
జయపుర పింక్ పాంథర్స్పట్నా పైరేట్స్
పుణెరి పల్టాన్బెంగళూరు బుల్స్
ఉత్తరప్రదేశ్యు ముంబా

4 దేశాల వన్డే టోర్నీ నెగ్గిన భారత మహిళలు
నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీని భారత్ గెలుచుకుంది. పోట్చెఫ్‌స్ట్రూమ్‌లో మే 21న దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆసియా రెజ్లింగ్‌లో హర్‌ప్రీత్ సింగ్‌కు కాంస్యం న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో హర్‌ప్రీత్ సింగ్ కాంస్యం గెలుచుకున్నాడు. ఈ మేరకు మే 10న జరిగిన పురుషుల గ్రీకో రోమన్ 80 కేజీల విభాగంలో జున్‌జీ నా (చైనా)తో జరిగిన బౌట్‌లో హర్‌ప్రీత్ 3-2 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 
ఆసియా చాంపియన్‌షిప్‌లో హర్‌ప్రీత్‌కు ఇది రెండో కాంస్యం. 2016లో బ్యాంకాక్‌లో జరిగిన ఇదే ఈవెంట్లో కాంస్యం నెగ్గాడు. 


ఐసీసీ చైర్మన్ పదవిలో కొనసాగనున్న మనోహర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా పూర్తి కాలం పదవిలో కొనసాగేందుకు శశాంక్ మనోహర్ అంగీకరించారు. ఇందుకు అనుగుణంగా 2018 జూన్ వరకు ఆయన చైర్మన్‌గా కొనసాగుతారు. 
వ్యక్తిగత కారణాలతో ఐసీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శశాంక్ మనోహర్ మార్చిలో ప్రకటించారు. అయితే ఐసీసీలో పలువురు సభ్యులు ఆయన కొనసాగాలని పట్టుబట్టడంతో జూన్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశం వరకు మాత్రమే ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం మనసు మార్చుకొని పూర్తి కాలం పదవిలో ఉండేందుకు అంగీకరించారు. 

ఫార్ములావన్‌లో మరో భారతీయుడికి అవకాశం
బెంగళూరుకు చెందిన 19 ఏళ్ల అర్జున్ మైనికి అంతర్జాతీయ ఫార్ములావన్ డ్రైవర్‌గా అవకాశం దక్కింది. ఈ మేరకు అమెరికా ఫార్ములావన్ జట్టు హాస్ ఎఫ్-1 మే 11న అర్జున్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం జీపీ3 రేసుల్లో అర్జున్ నిలకడగా రాణిస్తున్నాడు. భారత్‌కు చెందిన నారాయణ్ కార్తికేయన్, కరుణ్ చందోక్ తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) అవకాశం పొందిన మూడో డ్రైవర్ అర్జున్ మైని.


ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అనిల్‌కు కాంస్యం
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పురుషుల గ్రీకో రోమన్ 85 కేజీల విభాగంలో అనిల్ కుమార్ కాంస్యం గెలుచుకున్నాడు. కాంస్య పతక బౌట్‌లో అనిల్ 7-6 తో మొహమ్మద్ అలీ షమ్సీద్దినోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు. మరోవైపు మహిళల ఫ్రీస్టయిల్ 75 కేజీల విభాగంలో జ్యోతి 0-10తో మసాకా ఫురుచి (జపాన్) చేతిలో ఓడిపోయి కాంస్యం దక్కించుకుంది.


ఎంసీసీ క్లబ్‌లో లక్ష్మణ్‌కు చోటుభారత మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని అందజేసింది. తద్వారా ఈ క్లబ్‌లో చోటు సంపాదించిన ఐదో భారత క్రికెటర్‌గా లక్ష్మణ్ నిలిచాడు. సచిన్, ద్రవిడ్, గంగూలీ, జహీర్ ఖాన్‌లు ఇంతకుముందే ఎంసీసీలో సభ్యులుగా ఉన్నారు. 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన లక్ష్మణ్ 134 టెస్టుల్లో 45.97 సగటుతో 8,781 పరుగులు, 86 వన్డేల్లో 30.76 సగటుతో 2,338 పరుగులు సాధించాడు. 


ఆసియా రెజ్లింగ్‌లో సాక్షి, వినేశ్, దివ్యలకు రజతం ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత్‌కు మూడు రజతాలు, ఒక కాంస్యం దక్కింది. ఈ మేరకు మే 12న జరిగిన మహిళల 60 కేజీల కేటగిరీ ఫైనల్లో సాక్షి మలిక్ 0 - 10 తో రియో స్వర్ణ పతక విజేత రిసాకో కవాయి (జపాన్) చేతిలో ఓడిపోయింది. తద్వారా సాక్షికి రజతం దక్కింది. 
మహిళల 55 కేజీల ఫైనల్లో నాన్జో సే చేతిలో ఓడిపోయిన వినేశ్ ఫోగట్‌కు, 69 కేజీ కేటగిరీ ఫైనల్లో సారా దొషో (జపాన్) చేతిలో ఓడిన దివ్య కక్రున్‌కు రజతాలు దక్కాయి. 


ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బజరంగ్‌కు స్వర్ణం ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ బజరంగ్ పూనియా స్వర్ణం సాధించాడు. ఈ మేరకు మే 13న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో బజరంగ్ 6-2తో సెయుంగ్‌చుల్ లీ (దక్షిణ కొరియా)పై గెలిచి టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి పసిడి అందించాడు. 
మే 14న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 125 కేజీల విభాగంలో రన్నరప్‌గా నిలిచిన సుమీత్ రజతం సాధించాడు. మొత్తంగా ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ఒక స్వర్ణం, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 10 పతకాలు సొంతం చేసుకున్నారు. 


అర్జున్ మైనికి జీపీ-3 టైటిల్ బెంగళూరుకు చెందిన 19 ఏళ్ల డ్రైవర్ అర్జున్ మైని గ్రాండ్‌ప్రి (జీపీ)-3 సిరీస్ రేసులో విజేతగా నిలిచాడు. ఈ మేరకు మే 14న స్పెయిన్‌లో జరిగిన 17 ల్యాప్‌ల రేసులో అందరికంటే ముందుగా గమ్యాన్ని చేరి టైటిల్ గెలుచుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి డ్రైవర్‌గా గుర్తింపు పొందాడు. 
ఈ రేసులో అర్జున్ జెన్‌జెర్ మోటార్‌స్పోర్ట్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. 


స్పెయిన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్
స్పెయిన్ గ్రాండ్ ప్రీలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఈ మేరకు మే 14న జరిగిన రేసులో హామిల్టన్ 66 ల్యాప్‌లను గంటా 35 నిమిషాల 56.497 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానంలో, రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ (4వ స్థానం), ఒకాన్ (5వ స్థానం) టాప్-5లో స్థానం సంపాదించారు.


క్రికెట్‌లో భారత మహిళల రికార్డు భాగస్వామ్యం భారత మహిళా ఓపెనర్లు దీప్తి శర్మ (188 పరుగులు), పూనమ్ రౌత్ (109 పరుగులు) తొలి వికెట్‌కు 320 పరుగుల భాగస్వామ్యంతో రికార్డు సృష్టించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన నాలుగు దేశాల మహిళల వన్డే టోర్నీలో భాగంగా మే 15న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరు ఈ ఘనతను నమోదు చేశారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఏ వికెట్‌కై నా ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం. 
గతంలో ఈ రికార్డు సారా టేలర్, కరోలైన్ అట్కిన్స్‌ (ఇంగ్లండ్) పై ఉండేది. వారు 2008లో లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాపై తొలి వికెట్‌కు 268 పరుగులు సాధించారు. 


మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ సింగిల్స్ విజేత నాదల్ 
మాడ్రిడ్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు మే 14న జరిగిన ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై విజయం సాధించాడు. ఈ గెలుపుతో నాదల్ అత్యధికంగా 30 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో ఫెడరర్ (26 టైటిల్స్), అగస్సీ (17 టైటిల్స్), ఆండీ ముర్రే (14 టైటిల్స్), పీట్ సంప్రాస్ (11 టైటిల్స్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 
మొత్తంగా మాడ్రిడ్ ఓపెన్ చరిత్రలో చాంపియన్‌గా నిలువడం నాదల్‌కిది ఐదోసారి. 


ఇండియన్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్‌లో ద్యుతీచంద్‌కు స్వర్ణంఇండియన్ గ్రాండ్‌ప్రి అథ్లెటిక్స్ మూడో అంచె పోటీల్లో ఒడిశా స్ప్రింటర్ ద్యుతీచంద్ మహిళల 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. ఈ మేరకు మే 15న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్ రేసును 11.30 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మెర్లిన్ జోసెఫ్ (కేరళ-11.72 సెకన్లు) రజతం, హిమశ్రీ రాయ్ (బెంగాల్-11.95 సెకన్లు) కాంస్యం గెలిచారు. 


భారత మహిళల జట్టు కెప్టెన్‌గా మిథాలీ రాజ్అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు మిథాలీ రాజ్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ మేరకు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ మే 16న ప్రకటించింది. 
మహిళల ప్రపంచ కప్ 2017 జూన్ 24 నుంచి ఇంగ్లండ్‌లో జరగుతుంది. 
భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, వేదా కృష్ణమూర్తి, మోనా మెషమ్,్ర పునమ్ రౌత్, దీప్తి శర్మ, జులన్ గోస్వామి, శిఖా పాండే, ఏక్తా బిస్త్, సుష్మ వర్మ, మాన్సి జోషి, రాజేశ్వరి గైక్వాడ్, పునమ్ యాదవ్, నుజ్‌హత్ పార్వీన్, స్మృతీ మందనా.


వింబుల్డన్ ప్రైజ్‌మనీ పెంపుప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రైజ్‌మనీని 2 లక్షల పౌండ్ల మేర పెంచుతున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ మే 3న ప్రకటించింది. ఈ మేరకు 2017 పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 22 లక్షల పౌండ్ల చొప్పున (రూ. 18 కోట్ల 23 లక్షల 42 వేలు) అందజేస్తారు. 2016 వరకు ఈ మొత్తం 20 లక్షల పౌండ్లుగా ఉండింది.


ఫిఫా ర్యాంకింగ్స్‌లో 100వ ర్యాంకులో భారత్ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్‌‌సలో భారత జట్టు 21 ఏళ్ల తర్వాత మరోసారి టాప్-100లోకి వచ్చింది. ఈ మేరకు మే 4న ‘ఫిఫా’ ప్రకటించిన ర్యాంకుల్లో భారత్ 100వ స్థానాన్ని దక్కించుకుంది. జనవరిలో 129వ స్థానంలో ఉన్న భారత జట్టు తక్కువ వ్యవధిలోనే 29 స్థానాలు ఎగబాకి ఈ స్థానానికి చేరుకుంది. చివరిసారిగా భారత్ 1996 ఏప్రిల్‌లో 94వ ర్యాంకు సాధించింది


అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో భారత్‌కు కాంస్యం మలేసియాలో జరిగిన అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌కు కాంస్యం దక్కింది. ఈ మేరకు మే 6న న్యూజిలాండ్ జట్టుతో జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 4-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. 
34 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్ కాంస్య పతకం సాధించడం ఇది ఏడోసారి. గతంలో భారత్ 1983, 2000, 2006, 2007, 2012, 2015లో కాంస్య పతకాలు గెలిచింది. 
ఈ టోర్నీ ఫైనల్లో బ్రిటన్ 4-3తో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టును ఓడించి విజేతగా నిలిచింది. 


ఆసియా బాక్సింగ్‌లో శివ, సుమీత్‌లకు రజతాలు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు శివ థాపా, సుమీత్ సాంగ్వాన్‌లు రజతాలు సాధించారు. ఈ మేరకు మే 6న తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్)లో జరిగిన ఫైనల్లో శివ థాపా (60 కేజీలు) తొలి రౌండ్ ముగియకముందే గాయం కారణంగా వైదొలగగా... సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు) 0-5తో టాప్ సీడ్ వాసిలీ లెవిట్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. 
కాగా ఈ టోర్నమెంట్‌లో శివ థాపాకిది వరుసగా మూడో పతకం. 2013లో స్వర్ణం నెగ్గిన శివ 2015లో కాంస్య పతకం గెలిచాడు. తద్వారా వరుసగా మూడు ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన ఏకైక భారత బాక్సర్‌గా శివ థాపా గుర్తింపు పొందాడు. 


జులన్ గోస్వామి ప్రపంచ రికార్డు భారత క్రికెటర్ జులన్ గోస్వామి వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళ బౌలర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మేరకు మే 9న దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బ్యాట్స్‌వుమెన్ రైసిబి నటోజాకేను అవుట్ చేయడంతో జులన్ ఈ ఘనత సాధించింది. ఓవరాల్‌గా 153 మ్యాచ్‌ల్లో 181 వికెట్లను పడగొట్టి క్యాతీఫిజ్‌పాట్రిక్ (ఆస్ట్రేలియా) పేరు మీదున్న రికార్డును అధిగమించింది. 
జులన్ గోస్వామి భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, అర్జున అవార్డులు అందుకున్నారు. ఐసీసీ ఆమెకు 2007లో వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని ఇచ్చింది. 





Saturday, 15 April 2017

ఏప్రిల్ 2017 స్పోర్ట్స్

సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీలకు నూతన డీజీలు సీఆర్‌పీఎఫ్, ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీసు దళాలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 26న నూతన డెరైక్టర్ జనరల్‌లను నియమించింది. సీఆర్‌పీఎఫ్ డీజీగా 1983 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రాయ్ భట్నాగర్, ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్ దళాల డీజీగా 1983 బ్యాచ్ ఐపీఎస్ ఆర్‌కే పచనంద నియమితులయ్యారు. ఇంతకముందు సీఆర్‌పీఎఫ్ డీజీగా ఉన్న దుర్గాప్రసాద్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయటంతో సుదీప్ లక్తాకియా తాత్కాలిక డీజీగా వ్యవహరించారు. 


సృష్టి కౌర్‌కు మిస్ టీన్ యూనివర్స్ కిరీటం భారతీయ టీనేజర్ సృష్టి కౌర్ మిస్ టీన్ యూనివర్స్ కిరీటం - 2017ను సొంతం చేసుకున్నారు. ఈ మేరకు నికరాగ్వాలోని మనాగ్వా నగరంలో ఏప్రిల్ 26న జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఇదే పోటీల్లో ఉత్తమ జాతీయ కాస్ట్యూమ్ విభాగంలోనూ సృష్టి అవార్డుని సొంతం చేసుకున్నారు. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న యువతులకు ఈ పోటీలు నిర్వహిస్తుంది. 


ఐఓసీ కమిషన్ సభ్యురాలిగా నీతా అంబానీ ప్రతిష్టాత్మక ఒలింపిక్ చానల్ కమిషన్, ఒలింపిక్ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యురాలిగా నీతా అంబానీ నియమితులయ్యారు. ఈ మేరకు ఐఓసీ ఏప్రిల్ 26న ప్రకటించింది. 2016 రియో ఒలింపిక్స్‌తో ప్రారంభమైన చానల్‌లో మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు. దీనికి యునెటైడ్ స్టేట్స్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ లారెన్స్‌ ఫ్రాన్సిస్ నేతృత్వం వహిస్తారు. మాడ్రిడ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ చానల్ ఏడాది మొత్తం ఒలింపిక్ క్రీడలు, విలువలను ప్రమోట్ చేస్తుంది. 24 మంది సభ్యులు గల ఒలింపిక్ ఎడ్యుకేషన్ కమిషన్‌లోనూ నీతా అంబానీ సభ్యురాలిగా కొనసాగుతారు. ఈ బృందానికి బారీ జాన్ మైస్టర్ (న్యూజిలాండ్) నేతృత్వం వహిస్తారు.
రిలయన్స్‌ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన నీతా అంబానీ 2016లో ఐఓసీ సభ్యురాలిగా ఎన్నికవడం ద్వారా ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచారు. 

కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త చైర్మను్లతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాలు, వివాదాల పరిష్కారం కోసం ఏర్పడిన కృష్ణా, గోదావరి బోర్డులకు కేంద్ర జలసంఘం పూర్తి స్థాయి చైర్మన్లను నియమించింది. కృష్ణాబోర్డుకు ఎస్‌కే శ్రీవాత్సవను, గోదావరి బోర్డుకు హెచ్‌కే సాహును చైర్మన్లుగా నియమిస్తూ కేంద్ర జల సంఘం చైర్మన్ నరేంద్ర కుమార్ ఏప్రిల్ 27న ఉత్తర్వులు జారీ చేశారు. 
ఇంతకముందు ఎస్‌కే శ్రీవాత్సవ పుణేలో నేషనల్ వాటర్ అకాడమీ చీఫ్ ఇంజనీర్ స్థారుులో విధులు నిర్వర్తించారు. హెచ్‌కే సాహూ తీస్తా బేసిన్ ఆర్గనైజేషన్(టీబీఓ) పశ్చిమబెంగాల్ శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పని చేశారు.


బాలీవుడ్ నటుడు, ఎంపీ వినోద్ ఖన్నా కన్నుమూత ప్రముఖ బాలీవుడ్ నటుడు, లోక్‌సభ ఎంపీ వినోద్ ఖన్నా(70) ఏప్రిల్ 27న ముంబైలో కన్నుమూశారు. వినోద్ ఖన్నా 1968లో ‘మన్ కా మీత్’తో సినీ రంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలో ప్రతినాయకుడు, సహాయక పాత్రల్లో కన్పించిన ఆయన 1971లో గుల్జార్ సినిమా ‘మేరే అప్నే’తో హీరోగా గుర్తింపు పొందారు. చివరిసారిగా 2015లో షారూక్ ఖాన్ సినిమా దిల్‌వాలేలో నటించారు. రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవరించిన ఖన్నా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ తరఫున నాలుగుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. 

పిచాయ్‌కు 198 మిలియన్ డాలర్ల గూగుల్ స్టాక్ అవార్డు గూగుల్ సీఈవో, భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ 2016 ప్రతిఫలంగా (స్టాక్ అవార్డు) కంపెనీ నుంచి భారీ మొత్తం అందుకున్నారు. ఈ మేరకు 2016 సంవత్సరానికి 198.7 మిలియన్ డాలర్లను(దాదాపు రూ. 1291 కోట్లు) పిచాయ్‌కు గూగుల్ సంస్థ ఏప్రిల్ 28న అందజేసింది. 2015లో స్టాక్ అవార్డు(99.8 మిలియన్ డాలర్లు) కింద ఆయన అందుకున్న దానికి ఇది రెండింతలు. అలాగే పిచాయ్ 2016లో వేతనంగా 6.5 లక్షల డాలర్లు (4.22 కోట్లు) అందుకున్నారు. 
సుందర్ పిచాయ్ ఆగస్టు 2015లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గూగుల్ భారీ లాభాలను ఆర్జించింది. ప్రకటనల విభాగం, యూట్యూబ్ బిజినెస్‌లు బాగా పెరిగారుు. అలాగే మెషీన్ లెర్నింగ్, హార్డ్‌వేర్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2016లో గూగుల్ నుంచి స్మార్ట్‌ఫోన్ కూడా విడుదలైంది. 


టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సింఘాల్‌ను ఈవోగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం మే 1న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీటీడీ చరిత్రలో ఈవో పదవి చేపట్టిన మొట్టమొదటి ఉత్తరాది వ్యక్తిగా సింఘాల్ నిలిచారు. 
ప్రస్తుత టీటీడీ ఈవో డి.సాంబశివరావును వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల (రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసిన ప్రభుత్వం కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ప్రవీణ్ ప్రకాష్‌ను ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించింది.

సీఐఐ ప్రెసిడెంట్‌గా శోభన కామినేనిఅపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్‌గా ఉన్న శోభన కామినేని ప్రతిష్టాత్మక భారత పరిశ్రమల సమాఖ్య (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ/ సీఐఐ) చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు 2017-18 సంవత్సరానికి నూతన పాలక మండలిని సీఐఐ ఏప్రిల్ 30న ప్రకటించింది. శోభన ప్రస్తుతం కేఈఐ గ్రూపు వైస్ చైర్‌పర్సన్‌గానూ ఉన్నారు. కోటక్ మహింద్రా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ సీఐఐ నూతన వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. 


పీఏసీ చైర్మన్‌గా మల్లిఖార్జున్ ఖర్గేపార్లమెంట్ ప్రజా పద్దుల కమిటీ (Public Accounts Committee) కొత్త చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ కేవీ థామస్ పదవీకాలం ఏప్రిల్ 30న ముగియడంతో ఖర్గే బాధ్యతలు చేపట్టారు. ప్రతిపక్ష నేత అధ్యక్షత వహించే ఈ కమిటీలో ప్రస్తుతం 21 మంది సభ్యులున్నారు.


‘టైమ్’ అత్యంత ప్రభావశీలుర జాబితాలో మోదీ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన వందమంది వ్యక్తుల జాబితాలో భారత్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చోటు సంపాదించారు. ఈ మేరకు 2017కు సంబంధించిన జాబితాను టైమ్ మేగజీన్ ఏప్రిల్ 20న విడుదల చేసింది. 
ఆయా రంగాల్లో మార్గదర్శకులుగా నిలిచినవారు, కళాకారులు, నేతలు, ప్రముఖులకు ఈ జాబితాలో చోటు లభించింది. జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాన మంత్రి థెరెసా మే పేర్లు కూడా ఉన్నాయి. ఈ జాబితాను టైమ్ మేగజిన్ ఎడిటర్లు రూపొందించారు. 

పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌పై దర్యాప్తుకు జిట్ ఏర్పాటు పనామా పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై దర్యాప్తు జరిపేందుకు సంయుక్త దర్యాప్తు బృందం (జిట్) ఏర్పాటైంది. ఈ మేరకు ఆ దేశ సుప్రీం కోర్టు ఏప్రిల్ 20న జిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐఎస్‌ఐ, మిలిటరీ ఇంటెలిజెన్‌‌స, ఎఫ్‌ఐఏ, ఎన్‌ఏబీ, సెక్యూరిటీ, ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ సహా కీలక సంస్థలకు చెందిన అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. షరీఫ్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ జిట్ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. 


భారత మహిళల క్రికెట్ కోచ్‌గా తుషార్ అరోథే భారత మహిళల క్రికెట్ హెడ్ కోచ్ పదవి నుంచి పూర్ణిమా రావును తప్పిస్తూ బీసీసీఐ ఏప్రిల్ 21న నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో బరోడా మాజీ క్రికెటర్ తుషార్ అరోథేను హెడ్ కోచ్ పదవికి ఎంపిక చేసింది. 2017 జూన్‌లో భారత్‌లో మహిళల ప్రపంచ క్రికెట్ కప్ జరగనుంది. 


అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపినవ్యోమగామిపెగ్గీ విట్సన్నాసాకు చెందిన వ్యోమగామి పెగ్గీ విట్సన్ క్రమం తప్పకుండా ఎక్కువ రోజులపాటు అంతరిక్షం (స్పేస్)లో గడిపిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ మేరకు గతంలో 534 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన జెఫ్ విలియమ్స్ రికార్డును పెగ్గీ ఏప్రిల్ 24న అధిగమించారు. ఆమె భూమికి తిరిగొచ్చే సమయానికి అంతరిక్షంలో 650 రోజులు గడిపిన వ్యోమగామిగా మరో రికార్డును నెలకొల్పుతారని నాసా ప్రకటించింది. దాదాపు 53 గంటలపాటు నిర్విరామంగా స్పేస్‌వాక్ చేసిన మహిళా వ్యోమగామి రికార్డు కూడా పెగ్గీ పేరిటే ఉంది. 


గాంధీ ఇన్ చంపారన్ పుస్తకావిష్కరణడీజీ టెండూల్కర్ ర చించిన "గాంధీ ఇన్ చంపారన్ " పుస్తకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏప్రిల్ 9న ఆవిష్కరించారు. సత్యాగ్రహ ఉద్యమంలో మహాత్మా గాంధీ అవలంబించిన విధానాలను, ఆయన జీవిత లక్ష్యాలను ఈ పుస్తకంలో వివరించారు.
డీజీ టెండూల్కర్ ఇది వరకే Mahatma: Life of Mohandas Karamchand Gandhi పేరుతో గాంధీజీ జీవిత చరిత్రను రచించారు. ఇది 8 సంపుటాల్లో విడుదలైంది. 


యూఎన్‌డీపీ అడ్మినిస్ట్రేటర్‌గా అచిమ్ స్టెయినర్ ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల్లో అపార అనుభవం ఉన్న అచిమ్ స్టెయినర్ యూఎన్‌డీపీ (United Nations Development Programme) అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటై ఏప్రిల్ 13న ప్రకటించారు. యూఎన్‌డీపీ కేంద్ర కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. ఇది ప్రపంచ దేశాల్లో పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి, మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది. 


కంప్యూటర్ శాస్త్రవేత్త రాబర్ట్ టేలర్ మృతి ఇంటర్‌నెట్‌కు బీజం వేయటంతో పాటు పర్సనల్ కంప్యూటర్‌ను అభివృద్ధి పరచటంలో కీలక పాత్ర పోషించిన కంప్యూటర్ శాస్త్రవేత్త రాబర్ట్ టేలర్ (85) ఏప్రిల్ 16న అమెరికాలో కన్నుమూశారు. ఆయన 1966లో పెంటగాన్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీలో పనిచేస్తున్న సమయంలో సహోద్యోగులతో సంభాషించేందుకు తన నేతృత్వంలో అర్ఫానెట్‌ను సృష్టించి అన్ని కంప్యూటర్లను అనుసంధానం చేశారు. తదనంతర కాలంలో అదే ఇంటర్‌నెట్‌గా పరిణామం చెందింది. 


టైమ్-100 రీడర్స్ పోల్‌లో డ్యుటెర్టోకు అగ్రస్థానం ‘టైమ్-100’ ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్ పోల్‌లో ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టో అగ్రస్థానంలో నిలిచారు. 2016లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల ఎంపిక కోసం జరిపిన పోల్ ఫలితాలను టైమ్ సంస్థ ఏప్రిల్ 17న వెల్లడించింది. ఇందులో డ్యుటెర్టోకు అత్యధికంగా 5 శాతం ఓట్లు రాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, పోప్ ఫ్రాన్సిస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌లకు 3% చొప్పున వచ్చాయి. 

ఫోర్బ్స్ 30 జాబితాలో 53 మంది భారతీయులు ఫోర్బ్స్ ‘30 అండర్ 30 ఆసియా’ జాబితాలో 53 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు వివిధ రంగాల్లో సత్తా చాటిన 30 ఏళ్లలోపు యువ అఛీవర్స్ జాబితాను ఫోర్బ్స్ ఏప్రిల్ 17న విడుదల చేసింది. 
వినోదం, ఆర్థికం, రిటైల్, క్రీడలు ఇలా పది రంగాల్లో 30 మంది చొప్పున 300 మందితో ఈ జాబితా రూపొందించింది. ఇందులో భారత్ నుంచి దీపా కర్మాకర్, సాక్షిమాలిక్, ఆలియాభట్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన రోహిత్ పోతుకూచి, కరీంనగర్‌కు చెందిన చిలప్పగరి సుధీంద్ర తదితరులున్నారు. చైనా నుంచి 76 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది.


రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా అరెస్టువేలకోట్ల రుణాలను ఎగవేసి లండన్‌లో తలదాచుకున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను ఏప్రిల్ 18న స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. మాల్యాను భారత్ రప్పించే ప్రక్రియలో భాగంగా బ్రిటన్‌తో జరిపిన సంప్రదింపుల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగిందని స్కాట్‌లాండ్ పోలీసులు తెలిపారు. అయితే అరెస్టయిన గంటలోపే వెస్ట్‌మినిస్టర్ కోర్టు మాల్యాకు బెయిల్ మంజూరు చేసింది. భారత్, బ్రిటన్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం మేరకు మాల్యాను అప్పగించాలంటూ భారత్ ఫిబ్రవరి 8న అధికారికంగా విజ్ఞప్తి చేసింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానాల కొనుగోలుకు ఐడీబీఐ, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఇండియా బ్యాంక్‌ల నుంచి వేల కోట్ల అప్పు తీసుకున్న మాల్యా వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్‌‌సకు ఇచ్చిన రూ.6,493 కోట్ల రుణాలను తిరిగి చెల్లించాలంటూ యునెటైడ్ బ్రూవరీస్‌కు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా అప్పులిచ్చిన బ్యాంకుల కన్సార్షియం అల్టిమేటం జారీ చేసింది. అయినా అప్పులు చెల్లించకపోవడంతో బ్యాంకులు మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాయి. దీంతో 2016లో మాల్యా లండన్ పారిపోయాడు.


షీలా పటేల్‌కు ఐక్యరాజ్యసమితి పదవిపద్మశ్రీ అవార్డు గ్రహీత, స్పార్క్ (సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఏరియా రిసోర్స్ సెంటర్స్) వ్యవస్థాపకురాలు షీలా పటేల్ ఏప్రిల్ 13న ఐక్యరాజ్యసమితి పట్టణ పేదరిక నిర్మూలన కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.

బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా మృతిభారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా (56) ఏప్రిల్ 12న న్యూఢిల్లీలో గుండెపోటుతో మరణించారు.

శిల్పకారుడు నందగోపాల్ కన్నుమూతప్రతిముఖ శిల్పకారుడు ఎస్.నందగోపాల్ (71) అనారోగ్యంతో ఏప్రిల్ 14న చెన్నైలో మరణించారు. ఆయనకు 1970లో జాతీయ అవార్డు, 1978లో లలిత కళా అకాడమీ అవార్డు దక్కాయి.

19వ శతాబ్దపు చివరి వ్యక్తిమార్టినా మోరానోప్రతిపంచంలోనే అత్యధిక వయస్సున్న బామ్మగా రికార్డుల్లోకెక్కిన ఎమ్మా మార్టినా మోరానో (117) ఇటలీలోని వెర్బానియాలో ఏప్రిల్ 15న మరణించారు. 1899, నవంబర్ 29న ఇటలీలో జన్మించిన మార్టినా మరణించేంత వరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.

నాస్కామ్ కొత్త చైర్మన్‌గా రామన్ రాయ్ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్‌గా రామన్ రాయ్ నియమితులయ్యారు. క్వాట్రో సీఎండీగా ఉన్న ఈయన 2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ సంస్థ చీఫ్‌గా కొనసాగుతారు. అలాగే నాస్కామ్ వైస్ చైర్మన్‌గా రిషద్ ప్రేమ్‌జీ ఎంపికయ్యారు. అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడైన ఈయన విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆర్. చంద్రశేఖర్ నాస్కామ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. 


కేసుల తీర్పుల్లో యూపీ న్యాయమూర్తి గిన్నిస్ రికార్డ్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ కోర్టు న్యాయమూర్తి తేజ్ బహదూర్ సింగ్ 327 రోజుల్లో 6,065 కేసులు పరిష్కరించి గిన్నిస్ రికార్డ్డు సృష్టించారు. ఈ మేరకు సింగ్ ఘనతను గిన్నిస్ రికార్డు ప్రతినిధులు ఏప్రిల్ 7న ధ్రువీకరించారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని కేసులను పరిష్కరించడం దేశంలోనే తొలిసారని బార్ అసోసియేషన్ తెలిపింది. కాగా సింగ్ పరిష్కార తీర్పుతో 903 జంటలు తిరిగి ఒక్కటయ్యాయి. 


ఐరాస శాంతిదూతగా మలాలాబాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ (19) ఐక్యరాజ్య సమితి శాంతిదూతగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ మూడో వారంలో జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ హోదా ఇవ్వనున్నట్లు యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఏప్రిల్ 8న ప్రకటించారు. దీంతో యూఎన్ శాంతిదూతగా నియమితురాలైన అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా గుర్తింపు పొందింది. 


శివసేన ఎంపీ గైక్వాడ్‌పై ఎఫ్‌ఐఏ నిషేధం ఎత్తివేత శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్‌ఐఏ) విధించిన నిషేధాన్ని ఏప్రిల్ 9న ఎత్తివేసింది. మార్చి 23న విమానం సీటు విషయంలో గైక్వాడ్ ఆవేశంతో ఎన్స్ర్ ఇండియా ఉద్యోగిని 25సార్లు చెప్పుతో కొట్టారు. దీంతో ఎన్స్ర్ ఇండియాతోపాటు ప్రైవేటు విమానయాన సంస్థలు గైక్వాడ్ ప్రయాణంపై నిషేధం విధించాన్స్. అయితే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్స్రిండియా సంస్థకు పౌరవిమానయాన శాఖ లేఖ రాయడంతో ఆయనపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. 


ఏఎస్‌ఆర్‌టీయూ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా రమణారావు టీఎస్‌ఆర్టీసీ ఎండీ రమణారావు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్‌‌సపోర్టు అండర్‌టేకింగ్‌‌స (ఏఎస్‌ఆర్‌టీయూ) స్థాయి సంఘం చైర్‌పర్సన్‌గా ఏప్రిల్ 10న నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లపాటు కొనసాగనున్నారు. సంఘంలో 15 మంది సభ్యులు ఉంటారు. 
రోడ్డు రవాణా సంస్థలు ఉమ్మడిగా అమలు చేయాల్సిన నిబంధనలు రూపొందించడంలో ఈ స్థాయి సంఘం కీలక పాత్ర పోషిస్తుంది. రోడ్డు రవాణా సంస్థలకు సూచనలు ఇవ్వడంతోపాటు అత్యంత కీలకమైన రవాణా విధానం రూపొందించటంలో కేంద్రానికి సిఫార్సులు చేస్తుంది. 


సుమిత్రా మహాజన్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ రాసిన "మాతోశ్రీ" పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 11న పార్లమెంట్ గ్రంథాలయ బిల్డింగ్‌లో ఆవిష్కరించారు. 1767 నుంచి 1795 మధ్య మాల్వా ప్రాంతంలో విస్తరించిన హోల్కర్ సామ్రాజ్యాన్ని పాలించిన దేవీ అహల్యాబాయి హోల్కర్ జీవితాన్ని, నాటి పరిస్థితులను సుమిత్రా మహాజన్ పుస్తకంలో వివరించారు. 


కర్ణాటక మాజీ సీఎంలపై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం అక్రమ గనుల తవ్వకాల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు ఎన్.ధరమ్ సింగ్, హెచ్‌డీ కుమారస్వామిల పాత్రపై విచారణ జరపాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ మార్చి 29న ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని చెప్పింది. దీంతో బళ్లారి జిల్లాలో 11,797 చదరపు కిలో మీటర్ల అటవీ భూమిని డీ-రిజర్వ్ చేసిన విషయంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులతోపాటు మరికొందరు అధికారులపై విచారణ సాగనుంది. మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం. కృష్ణకు మాత్రం విచారణ నుంచి మినహాయింపు లభించింది. 


ఎస్‌ఐగా నియమితులైన తొలి హిజ్రాతమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ప్రీతికా యాషిని దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. ఆమెకు ధర్మపురి (తమిళనాడు)లో పోస్టింగ్ ఖరారు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రీతి పటేల్‌కు ప్రవాసీ సమ్మాన్ పురస్కారంభారత సంతతికి చెందిన బ్రిటన్ సీనియర్ మంత్రి ప్రీతి పటేల్ మార్చి 27న ప్రవాసీ భారతీయ సమ్మాన్-2017 పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బ్రిటన్ అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

ప్రపంచ అందగత్తెల్లో ప్రియాంకకు రెండోస్థానంప్రపంచంలోనే అత్యంత అందమైన 30 మంది మహిళల్లో భారతీయ నటి ప్రియాంకా చోప్రాకు రెండోస్థానం లభించింది. ఈ మేరకు ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ బజ్‌ఫీడ్ నిర్వహించిన పోల్‌లో హాలీవుడ్ తారలు ఏంజెలినా జోలీ, ఎమ్మా వాట్సన్, బ్లాక్ లివ్లీ తదితరులను వెనక్కి నెట్టి ప్రియాంక రెండోస్థానాన్ని కైవసం చేసుకున్నారు. పాప్ గాయని బియాన్స్ మొదటిస్థానంలో నిలవగా ప్రముఖ మోడల్ టేలర్ హిల్ మూడోస్థానం దక్కించుకున్నారు. 


ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కనుంగొ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త డిప్యూటీ గవర్నర్‌గా బి.పి. కనుంగో ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్న ఆయన కరెన్సీ మేనేజ్‌మెంట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ వంటి విభాగాలకు నాయకత్వం వహించనున్నారు. 


హిందుస్తానీ గాయకురాలు అమోంకర్ మృతిప్రముఖ హిందుస్తానీ గాయకురాలు కిశోరీ అమోంకర్ (84) ఏప్రిల్ 3న ముంబైలో కన్నుమూశారు. 1932లో జన్మించిన అమోంకర్ గాయకురాలైన తన తల్లి మోగుబాయి కుర్దికర్ నుంచి తొలి సంగీత పాఠాలు నేర్చుకున్నారు. ఆమె 1987లో పద్మభూషణ్, 2002లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. 


ఈక్వెడార్ అధ్యక్షుడిగా లెనిన్ మారెనో ఈక్వెడార్ అధ్యక్షుడిగా పెయిస్ అలయెన్స్ పార్టీకి చెందిన లెనిన్ మారినో ఎన్నికయ్యారు. ఈ మేరకు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లెనిన్‌కు 51.16 శాతం ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి గిల్లర్‌మో లాస్సో (కన్జర్వేటివ్ పార్టీ)కు 48.04 శాతం ఓట్ల వచ్చాయి. 
లెనిన్ మారినో 2007 నుంచి 2013 వరకూ ఈక్వెడార్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.


ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా రాజీవ్ కుమార్ ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్ కుమార్ చందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏప్రిల్ 4న విదేశీ మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 1983 ఇండియన్ ఫారెన్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన రాజీవ్ కుమార్ 2006 నుంచి 2009 వరకు ఐరాసలో భారత మిషన్ డిప్యూటీ పర్మనెంట్ మెంబర్‌గా పనిచేశారు.